News January 20, 2025
జియో కస్టమర్లకు షాక్.. ఏకంగా రూ.100 పెంపు

రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్ ఇచ్చింది. రూ.199 ప్లాన్ను ఒక్కసారిగా రూ.100 పెంచి, ఇకపై రూ.299 అని జియో పేర్కొంది. పెంచిన ధరలు JAN 23 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.199 ప్లాన్ కస్టమర్లు ఆటోమెటిక్గా రూ.299 ప్లాన్కు బదిలీ అవుతారు. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్, నెలకు 25GB డేటా వస్తాయి. ఇక కొత్తగా చేరే కస్టమర్లు రూ.299కి బదులు రూ.349తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
Similar News
News February 3, 2026
బలహీన పోలింగ్ బూత్లపై TDP ప్రత్యేక దృష్టి

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓట్లు బాగా తగ్గిన పోలింగ్ బూత్లపై TDP ప్రత్యేక దృష్టి సారించింది. ఇలాంటి బూత్లు 4500 ఉన్నట్లు గుర్తించి వాటిపై సర్వే చేయించింది. వివిధ పదవులు పొందిన 1000 మంది నాయకులతో ఈ సర్వే పూర్తి చేసింది. వీటిలో ఉన్న లోపాలపై నివేదికలను రప్పించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు SEC కసరత్తు చేపట్టిన నేపథ్యంలో అంతకు ముందుగా ఈ బూత్లలో పార్టీని పటిష్ఠం చేసేలా శిక్షణకు నిర్ణయించింది.
News February 3, 2026
ఫిబ్రవరి 03: చరిత్రలో ఈ రోజు

☛ 1468: అచ్చుయంత్రాన్ని కనుగొన్న జోహన్నెస్ గుటెన్బర్గ్ మరణం
☛ 1924: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఉడ్రోవిల్సన్ మరణం.
☛ 1938: బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ జననం
☛ 1963: RBI 23వ గవర్నర్ రఘురాం రాజన్ జననం
☛ 2002: ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి మరణం(ఫొటోలో)
☛ నేడు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం
News February 3, 2026
ప్రీమియం ఫోన్ల వైపు ఇండియన్స్.. వాల్యూ షేర్లో ఐఫోన్ టాప్

భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో యాపిల్ రికార్డు సృష్టించింది. 2025లో ఏకంగా 28% వాల్యూ షేర్ను దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఇండియన్స్ ప్రీమియం ఫోన్ల వైపు మొగ్గు చూపుతుండటమే దీనికి కారణమని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఐఫోన్ 16 సిరీస్ సక్సెస్, ఈజీ ఫైనాన్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు యాపిల్కు కలిసొచ్చాయి. వాల్యూమ్ పరంగా భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ 1%, విలువ పరంగా 8% పెరిగింది.


