News January 20, 2025
జియో కస్టమర్లకు షాక్.. ఏకంగా రూ.100 పెంపు

రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్ ఇచ్చింది. రూ.199 ప్లాన్ను ఒక్కసారిగా రూ.100 పెంచి, ఇకపై రూ.299 అని జియో పేర్కొంది. పెంచిన ధరలు JAN 23 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.199 ప్లాన్ కస్టమర్లు ఆటోమెటిక్గా రూ.299 ప్లాన్కు బదిలీ అవుతారు. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్, నెలకు 25GB డేటా వస్తాయి. ఇక కొత్తగా చేరే కస్టమర్లు రూ.299కి బదులు రూ.349తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
Similar News
News January 31, 2026
సంజూ.. సొంత గడ్డపైనా ఫెయిల్

భారత బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి విఫలం అయ్యారు. సొంతగడ్డ తిరువనంతపురంలోనూ రన్స్ చేయలేకపోయారు. NZతో చివరి టీ20లో 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో స్టేడియంలోని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సిరీస్లో సంజూ 10, 6, 0, 24, 6 స్కోర్లతో కేవలం 46 రన్స్ మాత్రమే చేశారు. మరి ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 ప్రపంచకప్ తుది జట్టులో సంజూకు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.
News January 31, 2026
యాడ్స్లో ‘కింగ్’ నంబర్-1.. రెండో స్థానంలో మిస్టర్ కూల్

ఇండియన్ అడ్వర్టైజింగ్ స్క్రీన్ టైమ్లో 8% వాటాతో కింగ్ ఖాన్ షారుఖ్ నంబర్-1 స్థానంలో నిలిచినట్లు మార్కెటింగ్ మైండ్ సంస్థ వెల్లడించింది. అన్ని ఛానళ్లలో కలిపి రోజుకు సగటున 27 గంటలపాటు ఆయన యాడ్స్ ప్రసారమవుతున్నాయని తెలిపింది. రెండో స్థానంలో ధోనీ(రోజుకు 22Hr యాడ్స్) ఉన్నారని పేర్కొంది. ఆ తర్వాత వరుసగా అక్షయ్, రణ్వీర్ సింగ్, అమితాబ్, అనన్య, రణ్బీర్ కపూర్, అనుష్కా శర్మ, ద్రవిడ్, కోహ్లీ ఉన్నారంది.
News January 31, 2026
వారంలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు

AP: తిరుపతికి చెందిన బయ్యాల చాందిని వారం వ్యవధిలోనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆమె బుధవారం జుడీషియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరారు. 2 రోజుల క్రితం గ్రూప్-2లో జాబ్ వచ్చింది. తాజాగా శుక్రవారం విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో DSP క్యాడర్ పోస్ట్కు ఎంపికయ్యారు. ఆమె తండ్రి భాస్కర్ TTD రిసెప్షన్-1 డిప్యూటీ EOగా పని చేస్తున్నారు. కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమేనని చాందిని నిరూపించారు.


