News January 20, 2025
జియో కస్టమర్లకు షాక్.. ఏకంగా రూ.100 పెంపు

రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్ ఇచ్చింది. రూ.199 ప్లాన్ను ఒక్కసారిగా రూ.100 పెంచి, ఇకపై రూ.299 అని జియో పేర్కొంది. పెంచిన ధరలు JAN 23 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.199 ప్లాన్ కస్టమర్లు ఆటోమెటిక్గా రూ.299 ప్లాన్కు బదిలీ అవుతారు. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్, నెలకు 25GB డేటా వస్తాయి. ఇక కొత్తగా చేరే కస్టమర్లు రూ.299కి బదులు రూ.349తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
Similar News
News January 30, 2026
రూ.లక్ష జీతంతో ఐఐటీ ఢిల్లీలో ఉద్యోగాలు

<
News January 30, 2026
విష్ణువు వరాహ అవతారాన్ని ఎందుకు ఎత్తాడు?

హిరణ్యాక్షుడు వేదాలను అపహరించి, భూమిని సముద్ర గర్భంలో దాచాడు. దీంతో సృష్టి కార్యానికి ఆటంకం కలిగింది. అప్పుడు బ్రహ్మదేవుని నాసిక నుంచి అతి చిన్న రూపంలో వరాహ స్వామి ఉద్భవించాడు. క్షణ కాలంలోనే ప్రచండ రూపం దాల్చాడు. లోకోద్ధరణ కోసం సముద్రంలోకి దూకి, హిరణ్యాక్షుడిని సంహరించి, కోరలపై భూమిని నిలిపి పైకి తెచ్చాడు. వేదాలను రక్షించి, భూమిని ఉద్ధరించడమే ఈ అవతార ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత తిరుమలలో కొలువయ్యారు.
News January 30, 2026
టమాటలో పచ్చదోమ, తామర, సూది పురుగుల నివారణ

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల టమాటలో పచ్చదోమ, తామర పురుగు, సూది పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంది. పచ్చదోమ నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2ML లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగుల నివారణకు లీటరు నీటికి డైమిథోయెట్ 2ML లేదా మిథైల్ డెమటాన్ 2ML కలిపి పిచికారీ చేయాలి. సూది పురుగు నివారణకు లీటరు నీటికి నోవాల్యురాన్ 1.5ML లేదా ఫ్లూబెండమైడ్ 0.25ML పిచికారీ చేయాలి.


