News September 24, 2024
కర్ణాటక CM సిద్దరామయ్యకు షాక్

ముడా కుంభకోణం వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. దర్యాప్తు కోసం గవర్నర్ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూ కేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా సిద్దరామయ్య కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై విచారణకు గవర్నర్ ఆదేశించారు.
Similar News
News October 25, 2025
US ఆఫీసర్ హత్య.. మోదీని టార్గెట్ చేసినందుకేనా?

US స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ బంగ్లాదేశ్లో హత్యకు గురవడం అనుమానాలకు దారితీసింది. PM మోదీని చంపేందుకు CIA కుట్ర చేసిందని, దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా, రష్యా టెర్రెన్స్ను హతమార్చిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్ కార్లో రహస్యంగా చర్చించారని పేర్కొన్నాయి. దేశ ప్రజలకు నిజమేంటో చెప్పాలని కాంగ్రెస్ నేత సింఘ్వీ తాజాగా డిమాండ్ చేశారు.
News October 25, 2025
ఇంటి ఆవరణలో మారేడు మొక్క ఉండవచ్చా?

ఇంటి ఆవరణలో మారేడు మొక్క(బిల్వ వృక్షం) ఉండటం శుభకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ఈ మొక్క శివుడికి ప్రీతిపాత్రమైనది కాబట్టి ఇది గృహంలో పరమేశ్వరుని అనుగ్రహాన్ని సూచిస్తుందని అన్నారు. ‘ఇది ఇంట్లో ఉండడం వల్ల ఐశ్వర్యం, ధనవృద్ధి కలుగుతాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫలితంగా ఇంట్లో శాంతి, సమృద్ధి నెలకొని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి’ అని ఆయన వివరించారు. <<-se>>#Vasthu<<>>
News October 25, 2025
డీసీసీల నియామకం.. వేణుగోపాల్తో రేవంత్, భట్టి, మహేశ్ భేటీ

TG: రాష్ట్రంలో డీసీసీల నియామకంపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇవాళ ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్తో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ సైతం హాజరయ్యారు. డీసీసీల నియామకం, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్ఠం చేయడంపై చర్చించారు.


