News April 9, 2025
మ్యాక్స్వెల్కు షాక్.. డీమెరిట్ పాయింట్, 25% ఫైన్ విధింపు

PBKS ప్లేయర్ మ్యాక్స్వెల్కు IPL యాజమాన్యం షాకిచ్చింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ విధించడంతోపాటు ఒక డీమెరిట్ పాయింట్ను అతని ఖాతాలో చేర్చింది. నిన్న CSKతో మ్యాచ్లో ఒక్క పరుగుకే ఔటైన అతను క్రికెట్ వస్తువులు, గ్రౌండ్ ఎక్విప్మెంట్ను దుర్భాషలాడినట్లు సమాచారం. ఇటీవల ఇషాంత్ శర్మకు సైతం ఇవే కారణాలతో ఫైన్, డీమెరిట్ పాయింట్ విధించారు. కాగా 4 డీమెరిట్ పాయింట్లకు ఒక మ్యాచ్ నిషేధం ఉంటుంది.
Similar News
News December 11, 2025
తీపి వస్తువులు పూర్తిగా మానేస్తున్నారా?

షుగర్ వస్తుందనే భయంతో చాలామంది తీపి పదార్థాలను పూర్తిగా మానేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు తింటే ఇబ్బంది లేదని, అది కూడా తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘చక్కెర అధికంగా తీసుకుంటే ఊబకాయం, షుగర్, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో సమతుల్యం చేసుకుని అప్పుడప్పుడు (వారానికి ఒకసారి) స్వీట్స్ తింటే హాని కలగదు’ అని పేర్కొన్నారు. SHARE IT
News December 11, 2025
థాయ్లాండ్లో పట్టుబడిన లూథ్రా బ్రదర్స్

గోవా నైట్క్లబ్ <<18509860>>ప్రమాదం<<>>లో కీలక నిందితులు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్లాండ్లో పట్టుబడ్డారు. డిసెంబర్ 7న రాత్రి క్లబ్లో మంటలు చెలరేగి 25 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వీరిద్దరూ పరారయ్యారు. నిబంధనల ఉల్లంఘనే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. త్వరలో లూథ్రా బ్రదర్స్నూ భారత్కు తీసుకురానున్నారు.
News December 11, 2025
సోనియాగాంధీతో CM రేవంత్ భేటీ

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. హైదరాబాద్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించిన తీరును ఆమెకు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల వారి నుంచి సదస్సుకు వచ్చిన స్పందన, పెట్టుబడుల గురించి వివరించారు. ₹5.75 లక్షల కోట్ల ఇన్వెస్టుమెంట్లకు జరిగిన ఒప్పందాలను చెప్పారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించారు.


