News October 21, 2024

RCBకి షాక్.. కర్ణాటక ప్లేయర్ల కోసం ప్రభుత్వం ఒత్తిడి?

image

IPL-2025 వేలానికి ముందు RCBకి కొత్త సమస్య వచ్చింది. ఆ జట్టులోని కర్ణాటక ఆటగాళ్లు విజయ్ కుమార్, మనోజ్ భాండాగేను రిటైన్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. స్థానిక ఆటగాళ్లను ఎక్కువగా తీసుకోవాలని కోరుతోందని వార్తలు వస్తున్నాయి. దీనివల్ల తమ ప్రణాళికలు దెబ్బతింటాయని యాజమాన్యం భావిస్తోంది. కాగా RCB కోహ్లీ, సిరాజ్, మ్యాక్సీ, గ్రీన్, రజత్‌లను అట్టిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 3, 2025

పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే?

image

పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి ఆరునెలలు తల్లిపాలు, తర్వాత రెండేళ్ల వరకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్​తో కూడిని పోషకాహారం అందిస్తే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలంటున్నారు. వీటితో పాటు సమయానుసారం టీకాలు వేయించడం తప్పనిసరి.

News December 3, 2025

అమరావతికి రాజధాని హోదా.. కేంద్రం సవరణ బిల్లు

image

AP: అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం సవరణ బిల్లును తీసుకొస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడుతుంది.

News December 3, 2025

జనాభా పెంచేలా చైనా ట్రిక్.. కండోమ్స్‌పై ట్యాక్స్!

image

జననాల రేటు తగ్గుతుండటంతో చైనా వినూత్న నిర్ణయం తీసుకుంది. కొత్తగా కండోమ్ ట్యాక్స్ విధించనుంది. జనవరి నుంచి కండోమ్ సహా గర్భనిరోధక మందులు, పరికరాలపై 13% VAT విధించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు పిల్లల సంరక్షణ, వివాహ సంబంధిత సేవలపై వ్యాట్ తొలగిస్తోంది. కాగా 1993 నుంచి కండోమ్స్‌పై అక్కడ వ్యాట్ లేదు.