News November 14, 2024
రైతులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

TG: DAP ధర బస్తాపై ఏకంగా ₹300 పెరగడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50KGల DAP ధర ఇటీవల వరకు ₹1350 ఉండగా, తాజాగా ₹1650కు పెంచారు. పాత స్టాక్కు కొత్త ధర వర్తించదని ప్రభుత్వం చెబుతున్నా వ్యాపారులు ₹1650 వసూలు చేస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు. OCT నుంచి యాసంగి సీజన్ ప్రారంభం కాగా, ఇదే అదనుగా భావించి పలువురు వ్యాపారులు బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరకు అమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి.
Similar News
News November 11, 2025
బిహార్ ఎన్నికలు: 9 గంటల వరకు 14.55% పోలింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. 122 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన మగధ్, చంపారన్, సీమాంచల్లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలో 64.66% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
News November 11, 2025
మౌలానా అజాద్ NITలో ఉద్యోగాలు

మౌలానా అజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (<
News November 11, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 1

1. సూర్యుణ్ణి ఉదయింపజేయువారు ఎవరు? (జ.బ్రహ్మం)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (జ.దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (జ.ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (జ.సత్యం)
5. మానవుడు వేటి వలన శ్రోత్రియుడగును? (జ.వేదాలు)
6. దేనివలన మహత్తును పొందును? (జ.తపస్సు)
7. మానవునికి సహయపడుతుంది ఏది? (జ.ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (జ.పెద్దలను సేవించుట వలన) <<-se>>#YakshaPrashnalu<<>>


