News October 13, 2025
మద్యం తాగే మహిళలకు తీవ్ర వ్యాధుల ముప్పు

మద్యం తాగే అలవాటు ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా మద్యం సేవించే మహిళలకు అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. స్త్రీల శారీరక నిర్మాణం పురుషులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. కాబట్టి మద్యం ఎక్కువగా సేవిస్తే క్యాన్సర్, గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్ర వ్యాధులబారిన పడతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News October 13, 2025
ఇద్దరు సెంచరీ వీరులు ఔట్

ఢిల్లీలో భారత్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ కీలక భాగస్వామ్యానికి తెరపడింది. సెంచరీ హీరోలు ఓపెనర్ క్యాంప్బెల్ (115), షై హోప్ (103) ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలిన కరేబియన్ జట్టు ఫాలో ఆన్లో పోరాడుతోంది. ప్రస్తుతం విండీస్ స్కోర్ 289/4 కాగా 19 రన్స్ ఆధిక్యంలో ఉన్నారు.
News October 13, 2025
లాలూపై అభియోగాలు.. ఎన్నికల వేళ ఆర్జేడీకి షాక్

బిహార్ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఆర్జేడీకి ఎదురుదెబ్బ తగిలింది. IRCTC స్కామ్ కేసులో ఆ పార్టీ అగ్రనేత లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు మోపింది. అవినీతి, నేరపూరిత కుట్ర, చీటింగ్ ఛార్జెస్ నమోదు చేసింది. వారు విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే స్పష్టం చేశారు. కాగా కేసు విచారణకు స్వయంగా లాలూ వీల్ఛైర్లో హాజరయ్యారు.
News October 13, 2025
‘కపాస్ కిసాన్ యాప్’.. వాడకం ఎలా?

యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఓటీపీతో ఎంటర్ అవ్వాలి. తర్వాత రైతు పేరు, జెండర్, తేదీ, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత ఏ మార్కెట్లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. అలాగే భూమి సొంతమా? కౌలుదారా? అనేది చెప్పాలి. పొలం పాస్ బుక్, పంట రకం, విస్తీర్ణం కూడా నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తేదీ, టైమ్ ప్రకారమే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలి.