News March 25, 2024

వైసీపీకి షాక్?

image

AP:ప్రకాశం జిల్లాలో YCPకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. వైశ్య సామాజిక వర్గ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు TDPలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దర్శి వైసీపీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన.. ఈ నెల 27న TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లా రాజకీయాలపై పట్టు ఉన్న ఆయనకు దర్శి టికెట్ ఇచ్చేందుకు TDP హైకమాండ్ సానుకూలంగా ఉందట. అటు YCP టికెట్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దక్కింది.

Similar News

News November 27, 2025

బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: KTR

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం 17 శాతమే ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. CM రేవంత్ రాజకీయ నాయకుడిలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని.. హిల్ట్ పాలసీ పేరుతో 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు.

News November 27, 2025

పెళ్లికి రెడీ.. అమ్మాయి కావాలి అంతే: చాహల్

image

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ ఫొటోలను షేర్ చేసిన ఈ స్పిన్నర్.. ‘నేను పెళ్లికి రెడీగా ఉన్నా. అమ్మాయి కావాలి అంతే’ అని క్యాప్షన్ పెట్టారు. భార్యతో విడాకులు అయితే చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్తారని, కానీ చాహల్ కాన్ఫిడెన్స్‌కు మెచ్చుకోవాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News November 27, 2025

భాస్వరం, నత్రజని ఎరువులను ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనం?

image

పంట నాటిన/విత్తిన రెండు వారాలలోపే మొత్తం భాస్వరం ఎరువులను పంటలకు వేయాలి. పైపాటుగా వాడకూడదు. నత్రజని, పొటాష్ ఎరువులను పూతదశకు ముందే వేసుకోవాలి. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా మూడు దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. సూక్ష్మపోషక ఎరువులను పంటకు స్ప్రే రూపంలో అందించాలి.