News August 1, 2024

షాక్.. ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకొని బాలిక మృతి

image

TG: సెల్‌ఫోన్ <<13718301>>ఛార్జింగ్‌కు<<>> మరో చిన్నారి బలైంది. ఆదిలాబాద్ జిల్లా కొత్తమద్ది పడగకు చెందిన ఏడాదిన్నర బాలిక ఆరాధ్య ఇంట్లోని ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురైంది. తల్లిదండ్రులు ఆమెను ఖానాపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఛార్జింగ్ కేబుళ్లు పిల్లలకు అందకుండా పెట్టాలి. ఛార్జింగ్ పూర్తికాగానే తొలగించాలి.

Similar News

News February 2, 2025

BREAKING: చరిత్ర సృష్టించిన భారత్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ T20లో భారత్ చరిత్ర సృష్టించింది. T20Iలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసింది. అభిషేక్ శర్మ(94*), తిలక్ వర్మ(24) విధ్వంసంతో 6 ఓవర్లలో భారత్ 95/1 రన్స్ చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాట్లాండ్‌పై చేసిన 82/2 పవర్‌ప్లేలో భారత్‌కు అత్యధిక స్కోరు కాగా, ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేసింది. ప్రస్తుతం స్కోరు 9 ఓవర్లలో 136-2గా ఉంది.

News February 2, 2025

వాంఖడే స్టేడియంలో రిషి సునాక్

image

భారత్ పర్యటనలో ఉన్న బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ వాంఖడే స్టేడియంలో సందడి చేశారు. భారత్, ఇంగ్లండ్ జట్ల కెప్టెన్లు సూర్య, బట్లర్‌తో ఆయన సరదాగా సంభాషించారు. అంతకుముందు పార్సీ జింఖానా గ్రౌండ్‌లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా తన ముంబై పర్యటన ముగియదని Xలో రాసుకొచ్చారు.

News February 2, 2025

ఈ సారి CCL కప్పు గెలుస్తాం: అఖిల్

image

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఈ ఏడాది కప్పు గెలుస్తామంటూ హీరో అఖిల్ ధీమా వ్యక్తం చేశారు. 13 ఏళ్ల క్రితం విష్ణు ప్రారంభించిన CCL 11వ సీజన్ లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. జెర్సీ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నాలుగు సార్లు కప్పు గెలిచినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు CCL జరగనుంది. ఈ నెల 14, 15న తెలుగు వారియర్స్ మ్యాచ్ ఆడనుంది.