News October 20, 2024
పెట్రోల్ దాడిలో బాలిక మరణం కలచివేసింది: అనిత
AP: వైఎస్సార్ జిల్లాలో ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక <<14403526>>మరణించడం<<>> దిగ్భ్రాంతికి గురిచేసిందని హోంమంత్రి అనిత చెప్పారు. విద్యార్థినిపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తీవ్రంగా కలచివేశాయన్నారు. నిందితుడు విఘ్నేశ్, అతనికి సహకరించిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Similar News
News October 20, 2024
ఎవరేం చేసినా గ్రూప్-1 పరీక్ష ఆగదు: మంత్రి సీతక్క
TG: ఎవరేం చేసినా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఆగదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అభ్యర్థులు ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దని ఆమె కోరారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకులు జరిగాయని ఆమె ఆరోపించారు. పదేళ్లలో గ్రూప్-1, డీఎస్సీ పరీక్షలు నిర్వహించలేదని, ఇప్పుడేమో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.
News October 20, 2024
ఒలింపిక్ వీరుడికి క్యాన్సర్.. ఇంకా నాలుగేళ్లే!
బ్రిటిష్ ఒలింపిక్ సైక్లింగ్ ఛాంపియన్ సర్ క్రిస్ హోయ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. తాను ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను రెండు నుంచి నాలుగేళ్ల మధ్యలో జీవించే అవకాశం ఉందని వారు చెప్పినట్లు తెలిపారు. 48 ఏళ్ల స్కాట్ 2004- 2012 మధ్యకాలంలో ఆరుసార్లు ఒలింపిక్ స్వర్ణాలు గెలుచుకున్నారు.
News October 20, 2024
విరాట్ వికెట్ నాకెంతో ప్రత్యేకం: విలియం
ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో 7 వికెట్లు పడగొట్టిన NZ బౌలర్ విలియం ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘107 పరుగులు చేయడం ఇక్కడ సులభమని చెప్పలేను. మాకు వ్యతిరేకంగా ప్రపంచస్థాయి జట్టు ఉంది’ అని చెప్పారు. విరాట్ వికెట్పై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘మేము ఆడే ఆటలో గొప్ప ప్లేయర్ను ఔట్ చేయడం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే అలాంటి ప్లేయర్లను చూస్తూ పెరుగుతాం’ అని తెలిపారు.