News October 19, 2024

SHOCKING: కేజీ చికెన్ రూ.50

image

HYD ప్రకాశ్‌నగర్‌లో బాలయ్య అనే వ్యక్తి కుళ్లిన చికెన్ అమ్ముతున్న కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి చాలా తక్కువ ధరకు చికెన్‌ను దిగుమతి చేసుకుంటున్నాడు. జనతా బార్స్, కల్లు కాంపౌండ్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌కు కేజీ చికెన్‌ను రూ.30-50కే విక్రయించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. 10 నుంచి నెల రోజుల నాటి చికెన్ అమ్ముతున్నట్లు నిర్ధారించారు.

Similar News

News December 8, 2025

భారత్‌కు గుడ్‌న్యూస్.. గిల్ ఎంట్రీ పక్కా!

image

మెడ నొప్పి వల్ల SAతో టెస్టులు, వన్డేలకు దూరమైన గిల్ T20లతో తిరిగి జట్టులో చేరేందుకు రెడీ అయ్యారు. రేపట్నుంచి SAతో 5మ్యాచుల T20 సిరీస్ ప్రారంభం కానుండగా ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకున్నారు. BCCI CoEలో గిల్ ఫిట్‌నెస్ సాధించినట్లు క్రిక్‌బజ్ తెలిపింది. విశాఖలో చివరి వన్డే తర్వాత గంభీర్ కూడా దీన్ని ధ్రువీకరించగా గిల్ ఎంట్రీ పక్కా కానుంది. హార్దిక్ సైతం రీఎంట్రీ ఇస్తుండటంతో జట్టు బలం పెరిగింది.

News December 8, 2025

పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

image

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

News December 8, 2025

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు రుసుంతో చెల్లించవచ్చని చెప్పగా, తాజాగా 18వ తేదీ వరకు గడువు పెంచింది. అలాగే ఫైన్ లేకుండా ఈ నెల 9వ తేదీ వరకు, రూ.50 ఫైన్‌తో 12 వరకు, రూ.200 ఫైన్‌తో ఈ నెల 15 వరకు, రూ.500 ఫైన్‌తో ఈ నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.