News August 17, 2024

కలిచివేసే PHOTO

image

TG: ఉదయాన్నే తల్లిదండ్రులకు టాటా చెప్పి ఆనందంగా స్కూల్‌కు బయలుదేరిన ఓ విద్యార్థిని కాసేపటికే మృత్యు ఒడికి చేరుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆ చిన్నారి చెయ్యి నిర్జీవంగా వేలాడుతున్న ఫొటో అందరినీ కలచివేస్తోంది. హైదరాబాద్ హబ్సిగూడలో వెనక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో ఓ ఆటో ముందు వెళ్తున్న బస్సు కిందకి చొచ్చుకెళ్లింది. దీంతో ఆటోలో ఉన్న టెన్త్ విద్యార్థిని సాత్విక అక్కడికక్కడే దుర్మరణం పాలైంది.

Similar News

News November 20, 2025

పల్నాటి వీరారాధనోత్సవాల్లో రాయబార ఘట్టం

image

పల్నాటి వీరాధనోత్సవాల్లో గురువారం రాయబార ఘట్టాన్ని నిర్వహించారు. సుమారు 7 సంవత్సరాలు 6 నెలలుగా అరణ్యవాసంలో ఉన్న మాచర్ల రాజ్యమంది తిరిగి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని బ్రహ్మన్న మళ్లీ దేవరాజులు అనుకునే సంఘటనగా ఆచారవంతులు ప్రతిబింబించగా, పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొణతాలతో (వీరుల ఆయుధాలు) గ్రామోత్సవం ఘనంగా జరిగింది.

News November 20, 2025

గంభీర్‌పై విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

image

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓడటంతో హెడ్ కోచ్ గంభీర్‌పై <<18307995>>విమర్శలొచ్చిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పందించారు. ‘గంభీర్ ఒక్కడినే టార్గెట్ చేస్తూ అందరూ మాట్లాడుతున్నారు. బ్యాటర్లు, బౌలర్లు, సపోర్ట్ స్టాఫ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. కోల్‌కతా పిచ్‌ను మేం బ్లేమ్ చేయట్లేదు. అది అంత త్వరగా టర్న్ అవుతుందని ఊహించలేదు’ అని పేర్కొన్నారు.

News November 20, 2025

ఏపీని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తాం: DGP

image

AP: 2026 మార్చి నాటికి రాష్ట్రంలో మావోయిజాన్ని అంతం చేస్తామని DGP హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. రంపచోడవరంలోని AOB ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే చేశారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. 50 మంది మావోలను అరెస్ట్ చేశామన్నారు. APని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తామని, ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.