News March 15, 2025
షాకింగ్.. పెళ్లయిన వారిలోనే ఆ సమస్య ఎక్కువ

పెళ్లికి ముందుతో పోలిస్తే తర్వాతే మగవాళ్లు లావెక్కుతారని పొలాండ్లోని వార్సాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు తేల్చారు. మహిళల్లో ఇది 39 శాతమే ఉంటుందని చెప్పారు. సింగిల్స్తో పోలిస్తే పెళ్లయిన పురుషుల్లో ఊబకాయం సమస్యను మూడు రెట్లు పెంచుతుందని అధ్యయనంలో తెలిపారు. తినే ఆహార పరిమాణం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వంటివి కారణాలుగా అభిప్రాయపడ్డారు.
Similar News
News December 30, 2025
చదువుతో పాటు ‘సెల్ఫ్ డిఫెన్స్’ మస్ట్!

ఆపద ఎటునుంచి వస్తుందో తెలియదు. అందుకే అమ్మాయిలు ఆత్మరక్షణనే ఆయుధంగా మలచుకోవాలి. ఢిల్లీలో తన తల్లిని తోసేసి గొలుసు లాక్కెళ్లిన దొంగను 14 ఏళ్ల దివ్య వెంటాడి కరాటేతో మట్టికరిపించింది. ఈ సాహసం ఒక ఉదాహరణ మాత్రమే. నేటి సమాజంలో కేవలం చదువు ఒక్కటే సరిపోదు. మానవ మృగాలను ఎదుర్కోవడానికి ప్రతి అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్లో శిక్షణ పొందడం మంచిది. మీ కుమార్తెలను ధైర్యవంతులుగా తీర్చిదిద్దండి. share it
News December 30, 2025
తమలపాకు తోటలకు తెగుళ్ల సమస్య

తీవ్రమైన తెగుళ్లు తమలపాకు తోటలకు శాపంగా మారాయి. వేరు, మొదలు కుళ్లు, ఆకు కుళ్లు పంటను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. మరోవైపు తమలపాకు తోటలకు నీడనిచ్చే అవిశ చెట్లకు నత్తల బెడద పెరిగింది. ఇవి అవిశ చెట్ల ఆకులను, తమలపాకులను తిని రంద్రాలు చేస్తున్నాయి. దీంతో అవిశ చెట్లు ఎండిపోయి, నీడ లేకపోవడం వల్ల తమలపాకుల నాణ్యత తగ్గి, ధర పడిపోతోంది.
News December 30, 2025
చైనా మాంజా అమ్మేవారి సమాచారమిస్తే రూ.5వేలు: దానం

TG: పతంగులు ఎగురవేయడంలో చైనా మాంజా వినియోగంపై పోలీసులు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా కొన్ని చోట్ల ఈ మాంజాను వినియోగిస్తున్నారు. దీనిని రహస్యంగా అమ్ముతున్నవారి సమాచారం తనకు ఇవ్వాలని ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ ప్రజలను కోరారు. వారి వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా రూ.5వేల ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి కేసులు పెట్టేలా చూస్తామని హెచ్చరించారు.


