News March 5, 2025

అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి

image

TG: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు విద్యార్థి దుండగుడి కాల్పుల్లో బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన గంప ప్రవీణ్ (27) ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ విస్కాన్సిన్ మిల్వాకీలో నివాసం ఉంటున్నాడు. అతడి ఇంటికి సమీపంలోని బీచ్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మరణించాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Similar News

News March 28, 2026

అంతరిక్షంలో పిల్లలు పుడతారా?

image

అంతరిక్షంలో పునరుత్పత్తిపై జరిగిన పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జీరో గ్రావిటీ వల్ల వీర్యకణాలు తమ దిశను కోల్పోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై వెళ్లినట్లుగా ఇవి సరైన మార్గంలో ప్రయాణించలేకపోవడంతో అంతరిక్షంలో సహజ గర్భధారణ కష్టమని తేలింది. భవిష్యత్తులో ఇతర గ్రహాలపై నివాసాలు ఏర్పరచుకోవాలన్న ఆలోచనకు ఈ సమస్య పెద్ద సవాలుగా మారనుంది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి.

News March 28, 2026

Polyamory.. Tolyamory.. ఈ డేటింగ్ ట్రెండ్స్ తెలుసా?

image

డేటింగ్ ప్రపంచంలో కొత్త పదాలు వినిపిస్తుంటాయి. పార్ట్‌నర్ పర్మిషన్‌తో అందరికీ తెలిసేలా ఒకే టైమ్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో రిలేషన్ కొనసాగించడాన్ని ‘Polyamory’ అంటారు. ఇందులో ట్రాన్స్‌పరెన్సీ ముఖ్యం. మరోవైపు తన పార్ట్‌నర్‌కు బయట వేరే వ్యక్తితో సంబంధం ఉందని తెలిసినా చూసీచూడనట్లు వదిలేయడాన్ని ‘Tolyamory’ అంటారు. సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న ఈ మౌన అంగీకారానికి ఈ కొత్త పేరు వచ్చి చేరిందంతే.

News March 28, 2026

మూసీ పునరుద్ధరణ: ఆలయానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

image

TG: రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఈ నిర్మాణాన్ని మూసీ పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతోంది. ఆలయంలో వంద అడుగుల గాలి గోపురం, మూసీ నది మధ్యలో వంద అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీజలాలను కాపాడుకోవడం మన బాధ్యత అని సీఎం రేవంత్ చెప్పారు.