News March 20, 2025

కేంద్ర మంత్రి కుటుంబంలో కాల్పుల కలకలం

image

కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కుటుంబ సభ్యుల మధ్య కాల్పులు కలకలం రేపాయి. బిహార్‌లోని నవ్‌గచియాలో ఆయన మేనల్లుళ్లు అయిన విశ్వజిత్, జైజిత్ మధ్య నల్లా నీటి విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి. విశ్వజిత్ బుల్లెట్ గాయాలతో మరణించగా జైజిత్, తల్లి(నిత్యనందరాయ్ సోదరి) గాయపడ్డారు. జైజిత్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని భాగల్పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News January 25, 2026

2028లో స్పేస్ స్టేషన్ పనులు ప్రారంభం: ISRO

image

ఇండియన్ స్పేస్ స్టేషన్ పనులు 2028లో ప్రారంభమవుతాయని ISRO ఛైర్మన్ డా.వి.నారాయణన్ వెల్లడించారు. 2035 నాటికి పూర్తవుతాయని తెలిపారు. ఇటీవల ఫెయిలైన PSLV-C62 మిషన్ ప్రభావం ‘గగన్‌యాన్’ (మానవ సహిత అంతరిక్ష యాత్ర) ప్రాజెక్టుపై ఉండదని స్పష్టం చేశారు. చంద్రుని సౌత్ పోల్‌పై స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఘనత మనదేనని గుర్తుచేశారు. కాగా గగన్‌యాన్ మిషన్‌ను 2026 చివర్లో/2027లో ప్రయోగించే అవకాశముంది.

News January 25, 2026

నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో పోస్టులు

image

<>CSIR-<<>>నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 35 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ అర్హత గలవారు ముందుగా NAT పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిబ్రవరి 4, 5తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, MVV, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్‌కు నెలకు రూ.10,560, వెల్డర్‌కు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nal.res.in

News January 25, 2026

ఆదివారం రోజున ఈ పనులు చేస్తున్నారా?

image

ఆదివారం, సప్తమి రోజుల్లో కొన్ని పనులు చేస్తే సూర్య దోషం కలగవచ్చని పండితులు చెబుతున్నారు. ‘మద్యమాంసాలు ముట్టకూడదు. క్షురకర్మ చేసుకోకూడదు. తలస్నానానికి నూనె వాడకూడదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం అశుభం. తోలు వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. సూర్యాస్తమయానికి ముందే తినేయాలి. ఆ తర్వాత చేసే భోజనం ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఈ నియమాలు అతిక్రమిస్తే దారిద్ర్యం, అనారోగ్యం, కంటి సమస్యలు వచ్చే అవకాశముంది’ అంటున్నారు.