News September 3, 2024
పాల కొరత.. అర లీటర్ రూ.80
AP: వరదల్లో మునిగిపోయిన విజయవాడలో పాల కొరత తీవ్రమైంది. ఇదే అదునుగా వ్యాపారులు రేట్లు పెంచేశారు. అరలీటర్ ప్యాకెట్ రూ.70-80 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇళ్లలో పిల్లలు ఉన్నారని, కనీసం ఒక్క ప్యాకెటైనా ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నారు. విజయ డెయిరీ, కృష్ణ మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీస్ మునిగిపోవడంతో లక్షల లీటర్ల పాలు, పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి. దీంతో సమస్య పెరిగింది.
Similar News
News February 2, 2025
సంధ్య థియేటర్ తొక్కిసలాట.. విదేశాలకు శ్రీతేజ్?
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్లాల్సి వస్తే ఖర్చు తానే భరిస్తానని వైద్యులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ 4న గాయపడ్డ శ్రీతేజ్ రెండు నెలలు కావొస్తున్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ట్యూబ్ ద్వారానే లిక్విడ్ ఫుడ్ అందిస్తున్నారు.
News February 2, 2025
కులగణన సర్వే వివరాలు
TG: * సర్వేలో పాల్గొన్న జనాభా: 3.54 కోట్లు(96.9 శాతం)
* ఎస్సీల జనాభా: 17.43 శాతం
* ఎస్టీల జనాభా: 10.45 శాతం
* బీసీల జనాభా: 46.25 శాతం
* ముస్లిం మైనారిటీ బీసీలు: 10.08 శాతం
* ముస్లింల మైనారిటీ బీసీలతో కలిపి మొత్తం బీసీలు: 56.33 శాతం
* ముస్లిం మైనారిటీ ఓసీలు: 2.48 శాతం
* ముస్లిం మైనారిటీలు: 12.56 శాతం
* ఓసీల జనాభా: 15.79 శాతం
* సర్వేలో పాల్గొనని జనాభా- 3.1 శాతం
News February 2, 2025
ఈ నెల 4న కులగణనపై క్యాబినెట్ భేటీ
TG: రాష్ట్రంలో బీసీల సామాజిక న్యాయానికి అడుగుపడిందని క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో కులగణన సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. ఇలాంటి సర్వే దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. ఈ నెల 4న నివేదికపై క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామన్నారు. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలోనూ డిస్కస్ చేయనున్నట్లు పేర్కొన్నారు.