News April 29, 2024
నీళ్లు, విద్యుత్ కొరత.. ఓయూలో హాస్టళ్లు, మెస్సులు బంద్

TG: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లు, మెస్సులకు అధికారులు వేసవి సెలవులు ప్రకటించారు. వీటిని మే 1 నుంచి మే 31వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. అలాగే వర్సిటీలో నీళ్లు, విద్యుత్ కొరత ఉందని పేర్కొన్నారు. విద్యార్థులంతా సహకరించాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా వర్సిటీ హాస్టళ్లలో నీటి కొరతపై ఇటీవల విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
Similar News
News December 29, 2025
ALERT: పెరగనున్న కార్ల ధరలు!

కొత్త ఏడాదిలో కారు కొనాలనుకునే వారికి వాహన తయారీ సంస్థలు షాకిచ్చాయి. ముడిసరుకుల ధరలు, నిర్వహణ వ్యయం పెరగడంతో జనవరి తొలివారంలో కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. సుజుకీ, హ్యుందాయ్, MG, టాటా, మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్ వంటి సంస్థలు మోడల్ను బట్టి 1% నుంచి 3% వరకు ధరలను పెంచే అవకాశం ఉంది. అయితే ఇయర్ ఎండ్ సేల్స్లో భాగంగా ఈ సంస్థలు భారీ డిస్కౌంట్స్తో అమ్మకాలు జరుపుతున్న విషయం తెలిసిందే.
News December 29, 2025
ఇతిహాసాలు క్విజ్ – 111 సమాధానం

ఈరోజు ప్రశ్న: మహాభారతంలో పాండవుల కోసం మయసభను నిర్మించింది ఎవరు? రామాయణంలో ఆయన పాత్ర ఏంటి?
సమాధానం: మహాభారతంలో పాండవుల కోసం అద్భుతమైన మయసభను నిర్మించింది మయాసురుడు. ఈయన గొప్ప అసుర శిల్పి. రామాయణంలో ఈయన రావణుడికి మామగారు. రావణుడి భార్య మండోదరి తండ్రి మయాసురుడే. ఆయన రామాయణ కాలంలో అసురులకు భవనాలు, నగరాలను నిర్మించే శిల్పిగా కూడా ప్రసిద్ధుడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 29, 2025
నటి మాధవీలతపై కేసు నమోదు

నటి మాధవీలతపై HYDలోని సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. SMలో సాయిబాబాపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లపైనా కేసు పెట్టారు. వీరి పోస్టులు ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశాయని ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని ఆదేశించారు. అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


