News April 29, 2024
నీళ్లు, విద్యుత్ కొరత.. ఓయూలో హాస్టళ్లు, మెస్సులు బంద్

TG: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లు, మెస్సులకు అధికారులు వేసవి సెలవులు ప్రకటించారు. వీటిని మే 1 నుంచి మే 31వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. అలాగే వర్సిటీలో నీళ్లు, విద్యుత్ కొరత ఉందని పేర్కొన్నారు. విద్యార్థులంతా సహకరించాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా వర్సిటీ హాస్టళ్లలో నీటి కొరతపై ఇటీవల విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
Similar News
News December 27, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న మొత్తం 72,487 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,500 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు వచ్చింది. వరుస సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగింది.
News December 27, 2025
టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు.. అప్లైకి 4రోజులే సమయం

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 4 రోజులే (DEC 31) సమయం ఉంది. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో 1,105 ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, PST/PET, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. 2026, FEB, ఏప్రిల్లో CBT ఉంటుంది. https://ssc.gov.in/ *మరిన్ని ఉద్యోగ వివరాలకు <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 27, 2025
AIIMS రాయపుర్లో 100 సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు

<


