News November 19, 2024

ఢిల్లీని ఇంకా రాజధానిగా కొనసాగించాలా?: శశి థరూర్

image

గాలి నాణ్యత అత్యంత తీవ్ర స్థాయికి చేరిన ఢిల్లీని దేశ రాజధానిగా ఇంకా కొనసాగించాలా? అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశ్నించారు. ప్రజలు నివాసయోగ్యంగా లేని నగరంగా ఢిల్లీ నిలుస్తోందని ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నవంబర్ నుంచి జనవరి వరకు పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News November 28, 2025

రోజుకు 30-35 లీటర్ల పాలు.. ఈ ఆవులతో డెయిరీఫామ్ మేలు

image

ప్రపంచంలోనే అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతుల్లో హోలిస్టిన్ ఫ్రీజియన్ ఒకటి. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఒక ఈతలో 9వేల లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. ఇవి రోజుకు కనీసం 25-30 లీటర్లు, కొన్ని సందర్భాల్లో 35-40 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాలలో కొవ్వు 3.5%గా, ప్రొటీన్ 3.1%గా ఉంటుంది. ఈ రకం ఆవులతో డెయిరీఫామ్ నిర్వహణ మేలంటున్నారు వెటర్నరీ నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.

News November 28, 2025

అవసరమైతే కోర్టులో మూలన నిలబెట్టగలం.. రంగనాథ్‌పై HC తీవ్ర ఆగ్రహం

image

TG: అంబర్‌పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై HC ఆగ్రహించింది. న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా అని ప్రశ్నించింది. అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టులో ఓ మూలన నిలబెడతామని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బతుకమ్మ కుంట భూవివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.

News November 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 80

image

ఈరోజు ప్రశ్న: ఉప పాండవులను చంపింది ఎవరు? ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>