News May 7, 2025

సీమా పాకిస్థాన్ వెళ్లాలా..? లాయర్ ఏమన్నారంటే?

image

PAKతో ఉద్రిక్తతల నడుమ ఆ దేశస్థులంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. అయితే అక్రమంగా దేశంలోకి వచ్చి భారత పౌరుడిని పెళ్లి చేసుకున్న పాకిస్థానీ సీమా హైదర్ దేశం వీడే అవసరం లేదని ఆమె లాయర్ శివ సింగ్ వెల్లడించారు. గ్రేటర్ నోయిడా వాసి సచిన్‌ను ఆమె పెళ్లి చేసుకుందని, ఇటీవల కూతురుకు జన్మనిచ్చిందని తెలిపారు. ఆమె పౌరసత్వం భర్తతో ముడిపడి ఉందని, కేంద్రం ఆదేశాలు వర్తించవని పేర్కొన్నారు.

Similar News

News April 2, 2026

పంత్ ఓపెనర్‌గానే రావాలి: అశ్విన్

image

LSG కెప్టెన్ పంత్ బ్యాటింగ్ పొజిషన్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా విఫలమైనప్పటికీ పంత్ ఆ స్థానాన్ని వదలొద్దని సూచించారు. పవర్ ప్లే తర్వాత వస్తే బౌలర్లు ఈజీగా కట్టడి చేస్తారని, అందుకే 14 మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గానే రావాలని కోరారు. కోచ్ లాంగర్, LSG మేనేజ్‌మెంట్‌లో ఎవరైనా ఈ విషయంపై పంత్‌కు నచ్చజెప్పి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలని సూచించారు.

News April 2, 2026

ఆ థియేటర్లలో ఇక పర్సెంటేజీ సిస్టమ్: ఎగ్జిబిటర్ల నిర్ణయం

image

TG: రెంటల్ సిస్టమ్ స్థానంలో పర్సెంటేజీ విధానం అమలు చేయాలని 23 థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. దీని ప్రకారం కలెక్షన్లలో తొలివారం 60%, రెండో వారం 50%, మూడో వారం 40% థియేటర్లకు అందనుంది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటర్లు అద్దె ప్రాతిపదికన చెల్లింపులు చేసే వారు. దీంతో లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్న తాము నష్టపోతున్నామని సదరు థియేటర్ల ఓనర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

News April 2, 2026

కిడ్నీ ముఠా గుట్టురట్టు.. మూవీ తీయొచ్చేమో!

image

UP కాన్పూర్‌లో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ ఉదంతం సినిమా స్టోరీని తలపిస్తోంది. ఓ యువకుడు తన కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేందుకు ముఠాతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఆపరేషన్ పూర్తయ్యాక అతనికి రూ.9.5లక్షలే ఇవ్వడంతో మిగిలిన డబ్బు కోసం గొడవ జరిగింది. ఆ కోపంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విచారణలో అంతర్జాతీయ ముఠా గుట్టురట్టైంది. వీరు రూ.10లక్షలకు కొని రోగికి రూ.60లక్షలకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.