News September 30, 2025
డబ్బింగ్ సినిమాకు రేట్లు పెంచడమా?

‘కాంతార చాప్టర్-1’ సినిమా టికెట్ <<17869775>>రేట్ల పెంపునకు<<>> ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలకు ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తుంటే.. మనం వాళ్ల సినిమాలకు రేట్లు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు తెలంగాణలో సైతం డబ్బింగ్ చిత్రాలకు టికెట్ ధరలు పెంచడం లేదని గుర్తు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News February 10, 2026
ఉపవాసం: ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు?

ఉపవాసం శ్రేష్ఠమైనదే అయినా అందరికీ వర్తించదు. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మధుమేహం, రక్తహీనత, గుండె జబ్బులు ఉన్నవారు సుదీర్ఘ సమయం ఆహారం మానేస్తే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. స్థూలకాయులు, BP, చర్మ వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహాతో ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
News February 10, 2026
స్పీకర్పై అవిశ్వాసం.. మెజార్టీ ఉంటేనే!

లోక్సభ స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్షాలు ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 94-C కింద తీర్మానం ప్రవేశ పెట్టాలి అంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలి. సభలోని 50 మంది సభ్యులు మద్దతుతో నోటీసు ఇచ్చాక చర్చకు నిర్దేశిస్తారు. 10 రోజుల్లోపే చర్చ చేపట్టి ఓటింగ్ నిర్వహిస్తారు. మెజార్టీ ఆధారంగా అనర్హత వేటు ఉంటుంది. కాగా లోక్సభలో NDAకే మెజార్టీ ఉండటంతో స్పీకర్ తొలగింపు అసాధ్యమే.
News February 10, 2026
కల్తీ నెయ్యి.. చంద్రబాబుకు పెద్ద జియ్యంగార్ల లేఖ

AP: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై పెద్ద జియ్యంగార్ల మఠం ఆగ్రహం వ్యక్తం చేసింది. నెయ్యి కల్తీ అపచారమని, బాధ్యతారహితమైన చర్య అని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొంది. భవిష్యత్తులో తిరుమలలో అపచారాలు జరగకుండా పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరింది. ఆలయాల పవిత్రతను, ధర్మాన్ని రక్షించే శక్తిని సీఎంకు ఇవ్వాలని ఆకాంక్షించింది. కాగా ఈ కేసులో ఇప్పటికే <<19088531>>ఈడీ<<>> ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.


