News March 10, 2025
శ్రేయస్ సైలెంట్ హీరో.. రోహిత్ శర్మ ప్రశంసలు

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత తరఫున టాప్ స్కోరర్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్(243)పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. అతనో సైలెంట్ హీరో అని కొనియాడారు. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారని, మిడిలార్డర్లో చాలా ముఖ్యమైన ప్లేయర్ అని చెప్పారు. ఈ విజయాన్ని భారత అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు హిట్ మ్యాన్ పేర్కొన్నారు. కాగా ఫైనల్లో అయ్యర్ 62 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 48 పరుగులు చేశారు.
Similar News
News March 10, 2025
అమెరికాతో ట్రేడ్వార్: ఆహారమే చైనా ఆయుధం!

అమెరికాతో ట్రేడ్వార్లో చైనా చాకచక్యం ప్రదర్శిస్తోంది. ‘అధిక ప్రభావం – తక్కువ ఖర్చు’ వ్యూహాన్ని అమలు చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్పై ఆహారాన్ని ఆయుధంగా ప్రయోగిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులపై US అతిగా ఆధారపడ్డ మూడో దేశం చైనా. చేపలు, రొయ్యల వంటి సముద్ర ఆహారం, వెల్లుల్లి, తేనె, పప్పులను దిగుమతి చేసుకుంటుంది. 2024లో ఈ వాణిజ్యం విలువ $3.9B పైమాటే. వీటిపై అధిక సుంకాలతో ఒత్తిడి పెంచాలన్నది జింగ్పింగ్ ఆలోచన.
News March 10, 2025
జియో కొత్త ప్లాన్.. రూ.100తో..

ఓటీటీ వ్యూయర్ల కోసం రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.100తో జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో పాటు 5GB డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. హాట్స్టార్ ఫోన్ లేదా టీవీ ఏదైనా ఒకదానిలో ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్లో ఎలాంటి వాయిస్ కాలింగ్ ఉండదు.
News March 10, 2025
ఆ రైతులకూ రూ.20వేలు: మంత్రి అచ్చెన్న

AP: అర్హులైన ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో జమ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులు, వెబ్ ల్యాండ్లో నమోదైన వారికీ పథకం వర్తిస్తుందన్నారు. మరో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. రూ.30 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చామన్నారు. 16 రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని వివరించారు.