News April 9, 2025

‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో శ్రేయస్ అయ్యర్

image

టీమ్ ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’కు నామినేట్ అయ్యారు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చిలో మూడు మ్యాచులు ఆడిన ఆయన 57.33 సగటుతో 172 రన్స్ చేశారు. అయ్యర్‌తో పాటు న్యూజిలాండ్ స్టార్స్ రచిన్, డఫీ ఉన్నారు. మహిళల క్రికెట్లో జార్జియా వాల్(Aus), సదర్లాండ్(Aus), చేతన ప్రసాద్(UAE) ఉన్నారు.

Similar News

News December 24, 2025

సీక్రెట్ శాంటా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా?

image

తుర్కియేలో 4వ శతాబ్దంలో సెయింట్ నికోలస్ అనే వ్యక్తికి సీక్రెట్ శాంటా ఆలోచన వచ్చింది. 1979లో లేరీ డీన్ స్టివర్ట్ అనే అమెరికన్ అవసరంలో ఉన్న వారికి డబ్బు సహాయం చేయడంతో ఈ కల్చర్ పాపులర్ అయింది. ఒకప్పుడు వెస్టర్న్ కల్చర్‌గా ఉండే గిఫ్ట్ పాలసీ నేడు భారత్‌లోనూ ట్రెండ్‌గా మారింది. ఆఫీసుల్లో కొలీగ్స్ మధ్య సామరస్యాన్ని పెంచుతోంది. ఏది ఏమైనా ఎదుటి వారి మొహంలో కనిపించే నవ్వు నిజమైన గిఫ్ట్. మీరేమంటారు?

News December 24, 2025

ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్‌లో కీలక సమాచారం?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ కీలకంగా మారుతోంది. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జి వివరాలు సహా వందల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది. వీటిని ప్రభాకర్ రావు ముందుంచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ పెన్ డ్రైవ్‌ కీలకం అవుతోంది.

News December 24, 2025

చరిత్రలో తొలిసారి.. వన్డేల్లో 574 పరుగులు

image

విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే సంచలనం నమోదైంది. వన్డే హిస్టరీలోనే తొలిసారి బిహార్ జట్టు 500 పరుగులు చేసింది. 45 ఓవర్లలోనే ఆ మైలురాయిని చేరుకుంది. మొత్తంగా 50 ఓవర్లలో 574/6 స్కోర్ చేసింది. వైభవ్ 190(84), ఆయుష్ 116(56), సకిబుల్ గని 128*(40B), పీయూష్ సింగ్ 77 ఆకాశమే హద్దుగా చెలరేగారు. గని 32 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించారు. లిస్టు A క్రికెట్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.