News April 9, 2025
‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో శ్రేయస్ అయ్యర్

టీమ్ ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’కు నామినేట్ అయ్యారు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చిలో మూడు మ్యాచులు ఆడిన ఆయన 57.33 సగటుతో 172 రన్స్ చేశారు. అయ్యర్తో పాటు న్యూజిలాండ్ స్టార్స్ రచిన్, డఫీ ఉన్నారు. మహిళల క్రికెట్లో జార్జియా వాల్(Aus), సదర్లాండ్(Aus), చేతన ప్రసాద్(UAE) ఉన్నారు.
Similar News
News January 1, 2026
నాబార్డ్లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

NABARDలో 17 స్పెషలిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ/పీజీ(కామర్స్/మ్యాథ్స్/ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్/ఫైనాన్స్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ/PGDBA/PGDM, CA/ICWA, ME, BCA, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBDలకు రూ.150. వెబ్సైట్: https://www.nabard.org
News January 1, 2026
గుడ్ న్యూస్.. ఆ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు

AP: న్యూఇయర్ వేళ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 5 రకాల భూములను 22-A(నిషేధిత) భూముల జాబితా నుంచి తొలగించే ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రైవేట్ భూములను ఈ జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలిపారు. స్వాత్రంత్ర్య సమరయోధులు, ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగులకు సరైన భూమి పత్రాలుంటే లిస్ట్ నుంచి తొలగిస్తామన్నారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
News January 1, 2026
Dec 31st.. బిర్యానీతో పాటు ఆశ్చర్యపరిచే ఆర్డర్లు

దేశవ్యాప్తంగా నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డెలివరీ యాప్లలో రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. ఎప్పటిలాగే బిర్యానీ టాప్లో నిలిచినా, ఈసారి కొన్ని ఆర్డర్లు ఆశ్చర్యపరిచాయి. ఐఫోన్లు, బంగారు నాణేలు, స్మార్ట్ వాచ్లు, ఉప్మా, కిచిడీ, హల్వా, సలాడ్లు సైతం పలువురు ఆన్లైన్లో కొనుగోలు చేశారు. స్విగ్గీ నుంచి ఒక్క రోజే 2 లక్షలకు పైగా బిర్యానీలు, లక్షకు పైగా బర్గర్లు డెలివరీ అయ్యాయి.


