News April 9, 2025
‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో శ్రేయస్ అయ్యర్

టీమ్ ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’కు నామినేట్ అయ్యారు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చిలో మూడు మ్యాచులు ఆడిన ఆయన 57.33 సగటుతో 172 రన్స్ చేశారు. అయ్యర్తో పాటు న్యూజిలాండ్ స్టార్స్ రచిన్, డఫీ ఉన్నారు. మహిళల క్రికెట్లో జార్జియా వాల్(Aus), సదర్లాండ్(Aus), చేతన ప్రసాద్(UAE) ఉన్నారు.
Similar News
News January 2, 2026
కూటమి దౌర్జన్యాలను తిప్పికొడదాం: YS జగన్

AP: పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి నేతలు దాడులు చేస్తున్నారని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. వీటిని బలంగా తిప్పికొడదామని నేతలకు పిలుపునిచ్చారు. తప్పులు చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతపురం(D) యల్లనూరులో పార్టీ ZPTC సభ్యుడు విజయప్రతాప్పై హత్యాయత్నాన్ని జగన్ ఖండించారు. ఆయన తండ్రి నారాయణ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.
News January 2, 2026
టీవీ రేటింగ్స్.. రికార్డు సృష్టించిన బిగ్బాస్-9

టీవీ రేటింగ్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే రికార్డు సృష్టించినట్లు హోస్ట్ నాగార్జున తెలిపారు. ‘స్టార్ మాలో 19.6 TVR, జియో హాట్స్టార్లో 285M స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయి. గత 5 సీజన్స్లో ఇదే అత్యధికం. ఈ సీజన్ మొత్తం ఎమోషన్స్, ప్యాషన్, కాన్ఫ్లిక్ట్స్, మర్చిపోలేని మూమెంట్స్తో నిండిపోయింది. ప్రేక్షకుల అసాధారణ మద్దతు నిజంగా హిస్టారిక్’ అని ట్వీట్ చేశారు.
News January 2, 2026
ఉపాధి హామీకి కేంద్రం తూట్లు పొడుస్తోంది: భట్టి

TG: ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు ఉంటే తప్పా? అని Dy.CM భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘ఉపాధి హామీకి BJP తూట్లు పొడుస్తోంది. ఏ వ్యక్తి ఎక్కడైనా పనిచేసే వీలుంటే.. దానిని నిర్దేశిత ఏరియాకి పరిమితం చేసింది. అన్స్కిల్డ్ లేబర్ను దోచుకోకూడదని మేము చట్టం చేస్తే.. నో వర్క్ ఇన్ పీక్ సీజన్ అనడం దోపిడీ కాదా? రైట్ టు వర్క్.. పర్మిట్ టు వర్క్గా మార్చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


