News April 9, 2025
‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో శ్రేయస్ అయ్యర్

టీమ్ ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’కు నామినేట్ అయ్యారు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చిలో మూడు మ్యాచులు ఆడిన ఆయన 57.33 సగటుతో 172 రన్స్ చేశారు. అయ్యర్తో పాటు న్యూజిలాండ్ స్టార్స్ రచిన్, డఫీ ఉన్నారు. మహిళల క్రికెట్లో జార్జియా వాల్(Aus), సదర్లాండ్(Aus), చేతన ప్రసాద్(UAE) ఉన్నారు.
Similar News
News January 1, 2026
NEW YEAR: హ్యాంగోవర్ తగ్గాలంటే..

న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం, మసాలా ఆహారం అతిగా తీసుకోవడం వల్ల మరుసటి రోజు తలనొప్పి, కడుపులో మంట, వికారం వంటి <<18724599>>సమస్యలు<<>> ఎదురవుతాయి. ఉపశమనం కోసం ఎక్కువగా నీరు తాగి డీహైడ్రేషన్ను తగ్గించుకోవాలి. కొబ్బరి నీళ్లు/ నిమ్మరసం తాగితే శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. అల్లం టీ వికారాన్ని, అరటిపండు నీరసాన్ని తగ్గిస్తుంది. తేలికపాటి ఆహారం తీసుకుని కాసేపు నిద్రపోతే హ్యాంగోవర్ తగ్గుతుంది. share it
News January 1, 2026
బత్తాయి జ్యూస్ లాభాలు తెలుసా?

నిత్యం మార్కెట్లో దొరికే బత్తాయి (మోసంబి) జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ జ్యూస్లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక గ్లాస్ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. డిటాక్సిఫికేషన్ ద్వారా శరీరం శుభ్రపడుతుంది. కళ్లకు, చర్మానికి, జుట్టుకు మేలు చేస్తూ వృద్ధాప్య ఛాయలు తగ్గించడంలో సహాయపడుతుంది.
News January 1, 2026
మామిడి చెట్లకు పూత రావాలంటే ఏం చేయాలి?

ఈ సమయంలో మామిడిలో పూమొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి, ఆడపూల శాతం పెంచడానికి లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10గ్రా., లీటరు నీటికి బోరాన్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి. కొందరు రైతులు పూత రాకపోవడంతో ఆ మామిడి చెట్లకు ఇప్పుడు నీరు పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల చెట్లలో మళ్లీ కొత్త చిగుర్లు వచ్చి, పూత రాకుండా పోతుంది లేదా పూత ఆలస్యమవుతుంది. నేలలో బెట్ట పరిస్థితులు పూత రావడానికి చాలా అవసరం.


