News April 9, 2025
‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో శ్రేయస్ అయ్యర్

టీమ్ ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’కు నామినేట్ అయ్యారు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చిలో మూడు మ్యాచులు ఆడిన ఆయన 57.33 సగటుతో 172 రన్స్ చేశారు. అయ్యర్తో పాటు న్యూజిలాండ్ స్టార్స్ రచిన్, డఫీ ఉన్నారు. మహిళల క్రికెట్లో జార్జియా వాల్(Aus), సదర్లాండ్(Aus), చేతన ప్రసాద్(UAE) ఉన్నారు.
Similar News
News December 29, 2025
ESIC హాస్పిటల్ కలబురగిలో ఉద్యోగాలు

<
News December 29, 2025
శీతాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే?

శీతాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల పిల్లలు త్వరగా రోగాలబారిన పడతారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పిల్లలు పరిశుభ్రత పాటించడం, నీరు ఎక్కువగా తాగడం ముఖ్యం. అలాగే పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి. వీటితో పాటు పప్పుధాన్యాలు, పాలు, పెరుగు, గుడ్లు, నట్స్ వంటి పోషకాహారాన్ని వారి ఆహారంలో చేర్చాలి. జంక్ ఫుడ్ను నివారించాలని సూచిస్తున్నారు.
News December 29, 2025
‘పెద్ది’లో జగపతిబాబు షాకింగ్ లుక్

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి నటుడు జగపతిబాబు ఫస్ట్ లుక్ విడుదలైంది. చూసిన వెంటనే గుర్తుపట్టలేనంతగా ఉన్న ఆయన లుక్ అభిమానులను షాక్కు గురి చేస్తోంది. ‘అప్పలసూరి’ అనే పాత్రలో జగపతిబాబు కనిపించనున్నట్లు మూవీటీమ్ ప్రకటించింది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.


