News November 27, 2024
IPL వేలంలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ

IPL 2025 వేలంలో టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోసం టోర్నీ చరిత్రలోనే అత్యధిక బిడ్లు దాఖలయ్యాయి. ఆయన కోసం ఫ్రాంచైజీలు ఏకంగా 103 బిడ్లు దాఖలు చేశాయి. కేకేఆర్, డీసీ, పంజాబ్ పోటీ పడడంతో బిడ్ల సంఖ్య సెంచరీ దాటింది. కాగా మెగా వేలంలో అయ్యర్ను రూ.26.75 కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
Similar News
News February 6, 2026
KCRపై రేవంత్ విషం చిమ్ముతున్నాడు: KTR

TG: వైఫల్యాన్ని, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి KCR వ్యక్తిత్వంపై CM రేవంత్ విషం చిమ్ముతున్నారని KTR అన్నారు. ‘ఇది తెలంగాణ పోరాట చరిత్ర మీద జరుగుతున్న దాడి. రేవంత్ తిట్ల ట్రాప్లో పడకండి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజా సమస్యలపై చర్చ జరగాలి. కానీ రేవంత్ తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నాడు. ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రజల తీర్పే KCRకు ఇచ్చే అసలైన గౌరవం’ అని Xలో పోస్ట్ చేశారు.
News February 6, 2026
దోష నివారణకు దివ్య మార్గం ‘సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం’

జాతకంలో కుజ, సర్ప, రాహు-కేతు దోషాలతో బాధ పడుతున్నారా? వివాహంలో ఆటంకాలా? అయితే మీకు సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం అత్యుత్తమ మార్గం. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ కల్యాణం, హోమంతో కుటుంబంలో శాంతి, వివాహ సౌఖ్యం, ధైర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. ఈ పూజ పూర్తి వీడియో రికార్డింగ్ను 24 గంటల్లో వాట్సాప్ ద్వారా పొందవచ్చు. మీ పేరు, గోత్రంతో జరిపించే ఈ పూజను వేద్మందిర్లో ఇప్పుడే <
News February 6, 2026
హీరో విజయ్కు మద్రాస్ హైకోర్టు షాక్

యాక్టర్, TVK అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులను కొట్టేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్ను సింగిల్ బెంచ్ కొట్టేసింది. 2015-16లో రూ.15కోట్ల ఆదాయానికి సంబంధించి పన్ను చెల్లించని కారణంగా రూ.1.50కోట్లు ఫైన్ కట్టాలని ఐటీ శాఖ నోటీసులిచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన CJ ధర్మాసనం జనవరి 23న తీర్పు రిజర్వ్ చేశారు. తాజాగా ఆ ఫైన్ కట్టాల్సిందేనని తీర్పునిచ్చారు.


