News April 15, 2025
ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్గా శ్రేయస్

ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ ఐసీసీ <<16037939>>ప్లేయర్ ఆఫ్ ది మంత్(మార్చి)<<>> అవార్డుకు ఎంపికయ్యారు. కివీస్కు చెందిన రచిన్ రవీంద్ర, జాకోబ్ డఫీ పోటీ పడినప్పటికీ అయ్యర్ను పురస్కారం వరించింది. ఉమెన్స్ విభాగంలో ఆసీస్ యంగ్ ప్లేయర్ జార్జియా వాల్ అవార్డు దక్కింది. కివీస్తో T20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడంలో ఈమె కీలక పాత్ర పోషించారు.
Similar News
News April 17, 2025
నేటి ముఖ్యాంశాలు

* TG: జపాన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
* కాంగ్రెస్ కుంభకోణాల్ని ప్రజలు మర్చిపోలేదు: కిషన్ రెడ్డి
* కంచ భూములపై స్టేటస్ కొనసాగుతుందన్న సుప్రీంకోర్టు
* ప్రభుత్వానికి ఇప్పుడైనా జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నాం: కేటీఆర్
* ఏపీకి అండగా ఉండాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన చంద్రబాబు
* రూ. 4687 కోట్లతో అమరావతి సచివాలయ నిర్మాణం
* సూపర్ ఓవర్లో RRపై DC విజయం
News April 17, 2025
సూపర్ ఓవర్.. DC టార్గెట్ ఎంతంటే?

IPL-2025: ఈ ఏడాది జరిగిన తొలి సూపర్ ఓవర్లో RR 11 పరుగులు చేసింది. రియాన్ పరాగ్, జైస్వాల్ రనౌట్ అయ్యారు. 20వ ఓవర్ అద్భుతంగా వేసి మ్యాచ్ను టై చేసిన స్టార్క్ సూపర్ ఓవర్లో బౌలింగ్ చేశారు. DC లక్ష్యం 12 పరుగులు. హెట్మెయర్ 5, పరాగ్ 4 రన్స్ చేయగా.. ఎక్స్ట్రాల ద్వారా 2 పరుగులు వచ్చాయి.
News April 17, 2025
IPL: మ్యాచ్ టై.. తొలి సూపర్ ఓవర్

DCvsRR మ్యాచ్ టైగా ముగిసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా స్టార్క్ అద్భుత బౌలింగ్ చేసి 8 పరుగులే ఇచ్చారు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. RR టాప్ ఆర్డర్ శాంసన్, జైస్వాల్, నితీశ్ రాణా రాణించినా ఆ జట్టు గెలవలేకపోయింది. కాసేపట్లో ఈ సీజన్లో తొలి సూపర్ ఓవర్ జరగనుంది.