News July 8, 2024
SI శ్రీనివాస్ ఆత్మహత్య.. గుండెపోటుతో మేనత్త మృతి

TG: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ (38)మరణవార్త విని అతడి మేనత్త గుండెపోటుతో మృతి చెందారు. వరంగల్ జిల్లా నాచినపల్లికి చెందిన దార రాజమ్మ(65).. తన మేనల్లుడు చనిపోయాడని తెలిసి కుప్పకూలిపోయింది. సీఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుల్స్ శేఖర్, శివ, నాగరాజు, సన్యాసినాయుడు, సుభాని తీవ్రంగా వేధించారని, కులం పేరుతో దూషించేవారని శ్రీనివాస్ మరణ వాంగ్మూలంలో తెలపడం సంచలనంగా మారింది.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


