News April 13, 2025
సియాచిన్ డే: భారత జవాన్ల ధీరత్వానికి సెల్యూట్

భారత ఆర్మీ ఇవాళ సియాచిన్ డే సందర్భంగా జవాన్ల సేవలను స్మరించుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమిగా పేరుగాంచిన సియాచిన్లో భారత ఆర్మీ 1984లో ఇదే రోజున ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. పాక్ సరిహద్దులోని సియాచిన్పై పూర్తి పట్టు సాధించింది. దశాబ్దాలుగా అక్కడి విపరీత వాతావరణ పరిస్థితులను తట్టుకుని రక్షణగా నిలుస్తున్న జవాన్ల ధీరత్వానికి సెల్యూట్.
Similar News
News April 14, 2025
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ బుజ్జగింపు సాధనంగా వాడింది: మోదీ

కాంగ్రెస్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని బుజ్జగింపు సాధనంగా వాడిందని ప్రధాని మోదీ విమర్శించారు. హస్తం పార్టీ తన అధికారానికి ముప్పు ఉందని భావించినప్పుడల్లా దేశ అత్యున్నత శాసనాన్ని తుంగలో తొక్కేదని నొక్కిచెప్పారు. రాజ్యాంగంతో దేశంలో సామాజిక న్యాయం జరుతుందని భావించిన అంబేడ్కర్ ఆశయాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. హరియాణాలో హిసార్ విమానాశ్రయంలో ప్లాంటును PM ప్రారంభించారు.
News April 14, 2025
నెలకు సగటున 15 ఆవులు మరణిస్తాయి: శ్యామలారావు

AP: భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ వ్యాఖ్యలు చేశారని టీటీడీ ఈవో శ్యామలారావు విమర్శించారు. 3 నెలల్లో 100 ఆవులు చనిపోయాయని అసత్య ప్రచారం చేశారన్నారు. ప్రతి నెలా సగటున 15 ఆవులు మరణిస్తాయని, 3 నెలల్లో 43 మృతి చెందాయని తెలిపారు. దాతలు ఇచ్చిన ఆవుల్లో కొన్ని అనారోగ్యంతో చనిపోయాయని చెప్పారు. మరణించిన ఆవులకు పోస్టుమార్టం చేయలేదనడం అవాస్తవమన్నారు.
News April 14, 2025
2021-24 మధ్య గోశాలలో అక్రమాలు: TTD EO

AP: తిరుమలలోని గోశాల నిర్వహణలో మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు ఎన్నో అక్రమాలు జరిగాయని టీటీడీ ఈవో శ్యామలారావు ఆరోపించారు. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలను దాచిపెట్టారన్నారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. అలాగే స్వామివారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. రూ.3 కోట్ల విలువైన సరకులకు రూ.25 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు.