News June 29, 2024
ప్రధాని మోదీతో సిద్ద రామయ్య భేటీ
రాబోయే బడ్జెట్లో కేటాయింపుల విషయంలో కర్ణాటకపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని మోదీని సీఎం సిద్ద రామయ్య కోరారు. ఢిల్లీలో PMతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని కర్ణాటక సీఎంవో ట్వీట్ చేసింది. బెంగళూరుకు పెట్టుబడులు వచ్చే విషయంలో చొరవ చూపాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. కర్ణాటక అభివృద్ధి, పురోగతికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం DK శివకుమార్ పాల్గొన్నారు.
Similar News
News September 20, 2024
ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారు?: షర్మిల
AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం చిన్న విషయం కాదని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే ఎందుకు బయటపెట్టలేదని, విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీశారు. జగన్ హయాంలో ఎంపిక చేసిన కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.
News September 20, 2024
యూట్యూబ్: వీడియో పాస్ చేసినా యాడ్స్ వస్తాయి!
YouTubeలో ‘Pause Ads’ అనే ఫీచర్ రానుంది. దీని వల్ల యూజర్లు వీడియో పాస్ చేసినా స్క్రీన్పై సైడ్కు యాడ్స్ ప్లే అవుతాయి. ఇప్పటికే వీడియోలు చూసేటప్పుడు వస్తున్న యాడ్స్తో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. తాజా ఫీచర్తో మరింత ఇబ్బంది పడే ఛాన్సుంది. యాడ్స్ వద్దనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవడమే బెటర్ అని నెటిజన్లు అంటున్నారు. INDలో YouTube ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధర నెలకు ₹149 నుంచి స్టార్ట్ అవుతుంది.
News September 20, 2024
గ్రీస్లో ఇష్టమొచ్చినట్టు ఇళ్లు కొంటున్న ఇండియన్స్
జులై, ఆగస్టులో గ్రీస్లో భారతీయ ఇన్వెస్టర్ల ఇళ్ల కొనుగోళ్లు 37% పెరిగాయి. ఆ దేశ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ రూల్స్ మారడమే దీనికి కారణం. అక్కడ ఇల్లు కొంటే శాశ్వత నివాసం పొందొచ్చు. 2013లో మొదలైన ఈ ప్రోగ్రామ్లో మొదట రూ.2.2 కోట్లు పెట్టుబడి పెడితే చాలు. తక్కువ డబ్బే కాబట్టి ఏథెన్స్ వంటి నగరాల్లో భూముల రేట్లు కొండెక్కాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సెప్టెంబర్1 నుంచి పెట్టుబడిని రూ.7 కోట్లకు పెంచారు.