News October 16, 2024

సిద్దరామయ్య చెప్పడంతోనే రిజైన్ చేశా: MUDA చీఫ్

image

కర్ణాటక సీఎం సిద్దరామయ్య చెప్పడంతోనే ముడాకు రిజైన్ చేశానని చీఫ్ ఎంకే మారిగౌడ స్పష్టం చేశారు. ‘UDD సెక్రటరీకి రిజిగ్నేషన్ ఇచ్చేశాను. సీఎం రిజైన్ చేయమని ఆదేశించారు. అందుకే చేశాను. ఆరోగ్యం బాగాలేకపోవడం మరో కారణం. ముడాపై దర్యాప్తు జరగనివ్వండి. ఆ తర్వాత అసలు నిజం తెలుస్తుంది. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ అంశంలో సీఎం నాపై ఒత్తిడి చేయలేదు’ అని ఆయన అన్నారు. సిద్దరామయ్యకు మారిగౌడ అత్యంత సన్నిహితుడు.

Similar News

News November 17, 2025

అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు(1/2)

image

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.

News November 17, 2025

iBOMMA రవి భార్య వల్ల దొరికిపోయాడా? క్లారిటీ ఇదే!

image

iBOMMA నిర్వాహకుడు రవి భార్యతో విడాకులు తీసుకునేందుకు వచ్చి పోలీసులకు దొరికిపోయాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదు. అతడికి ఐదేళ్ల క్రితమే విడాకులయ్యాయి. ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి రవికి చెల్లింపుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఐపీ అడ్రస్ లభించింది. అది మూసాపేట్‌లోని విస్టా అపార్ట్‌మెంట్స్ అని గుర్తించి నిఘా ఉంచారు. 2 రోజుల క్రితం అతడు ఫ్రాన్స్ నుంచి తిరిగి రాగానే అరెస్టు చేశారు.

News November 17, 2025

శ్రీ వేంకటేశ్వర వర్సిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో 24 అకడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. M.Phil/PhD అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి. వెబ్‌సైట్: https://svuniversityrec.samarth.edu.in