News September 20, 2024
సిద్దరామయ్య X గవర్నర్: ముడా కేసులో మరో ట్విస్ట్

కర్ణాటక CM సిద్దరామయ్యపై అన్ని డాక్యుమెంట్లు సహా డీటెయిల్డ్ రిపోర్టు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ షాలినీ రజనీశ్ను గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ ఆదేశించారు. KUDA చట్టానికి విరుద్ధంగా తన నియోజకవర్గం వరుణ, శ్రీరంగపట్నలో రూ.387 కోట్ల పనులు చేపట్టాలని MUDAను మౌఖికంగా ఆదేశించారని సీఎంపై గవర్నర్ వద్ద మరో పిటిషన్ దాఖలైంది. అధికార దుర్వినియోగంపై CBIతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్ కోరడంతో గవర్నర్ స్పందించారు.
Similar News
News January 6, 2026
పిల్లలకు బోటులిజం వస్తే ఏమవుతుందంటే?

ఇంఫాంట్ బోటులిజంలో పిల్లల కండరాలు బలహీనపడతాయి. చూపు మందగించడం, అలసట, నీరసం, సరిగ్గా ఏడవలేకపోవడం, పీల్చడం, మింగడంలో ఇబ్బందులు పడతారు. శ్వాస తీసుకోవడంలో కూడా కష్టం కలగవచ్చు. ఇది ఒక వైద్య అత్యవసర పరిస్థితి. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా తేనెలో చాలా తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ, పిల్లలకు అది కూడా ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు.
News January 6, 2026
HUDCOలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఢిల్లీలోని <
News January 6, 2026
నేడు చంద్రుడిని దర్శించుకుంటే పుణ్యం: పండితులు

సంకటహర చతుర్థి వ్రతంలో చంద్ర దర్శనం అత్యంత కీలకమైన ఘట్టం. సాధారణ చతుర్థి నాడు చంద్రుడిని చూడకూడదని చెబుతారు కానీ, సంకటహర చతుర్థి నాడు మాత్రం చంద్రుడిని చూస్తేనే వ్రత ఫలం లభిస్తుందట. సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి భక్తులు తమ ఉపవాసాన్ని విరమిస్తారు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా మారి, జాతకంలోని చంద్ర దోషాలు తొలగి, తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.


