News March 17, 2024

సిద్దిపేట: ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరగదన్నారు. జిల్లా ప్రజలు గమనించగలరని ఆయన సూచించారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోనూ రేపు ప్రజావాణి నిర్వహించారు.
SHARE IT

Similar News

News February 3, 2026

కాళ్లకల్‌లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

మనోహరాబాద్ మండలం కాల్లకల్‌లో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి కుమార్(25) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాళ్లకల్‌లో గత కొన్ని రోజులుగా నివాసం ఉంటూ స్థానిక పరిశ్రమలో పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

News February 3, 2026

మెదక్: జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు 4 ప్రాజెక్టులు

image

వైజ్ఞానిక ప్రదర్శనలో సీనియర్ విభాగంలో పాల్గొని ప్రతిభను చాటిన 4 ప్రాజెక్టులను జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైనట్లు డీఈఓ విజయ, డీఎస్ఓ రాజిరెడ్డి తెలిపారు.
1. బి.మహతి, తూప్రాన్ – వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నయం
2. అక్షయ్, మెదక్ మాచవరం-ఎమర్జింగ్ టెక్నాలజీ
3. గణేశ్ చీకోడ్ లింగాయపల్లి ఉన్నత పాఠశాల-నీటి సంరక్షణ. నిర్వహణ
4. ఆఫీఫా, మెదక్ వినోద భరిత గణితం

News February 3, 2026

మెదక్: జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు 4 ప్రాజెక్టులు

image

వైజ్ఞానిక ప్రదర్శనలో సీనియర్ విభాగంలో పాల్గొని ప్రతిభను చాటిన 4 ప్రాజెక్టులను జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైనట్లు డీఈఓ విజయ, డీఎస్ఓ రాజిరెడ్డి తెలిపారు.
1. బి.మహతి, తూప్రాన్ – వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నయం
2. అక్షయ్, మెదక్ మాచవరం-ఎమర్జింగ్ టెక్నాలజీ
3. గణేశ్ చీకోడ్ లింగాయపల్లి ఉన్నత పాఠశాల-నీటి సంరక్షణ. నిర్వహణ
4. ఆఫీఫా, మెదక్ వినోద భరిత గణితం