News March 18, 2024
సిద్దిపేట: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: హరీశ్ రావు
10వ తరగతి పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆకాంక్షించారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఒక ప్రకటనలో శుభాశీస్సులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కష్టపడి చదివిన అంశాలను రాయాలని ఉత్తమ ఫలితాలతో ముందంజలో నిలవాలన్నారు.
Similar News
News July 1, 2024
పటాన్చెరు: తల్లి మందలింపు.. బాలుడి అదృశ్యం
స్కూల్కి వెళ్లమని మందలించినందుకు బాలుడు అదృశ్యమైన ఘటన పటాన్చెరు పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జహీరాబాద్ వాసి స్వరూప భర్తతో గొడవపడి పటాన్చెరు మండలం ముత్తంగిలో వేరుగా ఉంటోంది. ముగ్గురు కుమారుల్లో 2వ వాడు ఇమాన్యూయల్(9)ను శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లడానికి సిద్ధంకమ్మని మందలించింది. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News July 1, 2024
సంగారెడ్డి: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
పద్మ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తూ హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. www.padmaawards. gov.inలో జూలై 31లోగా ఆసక్తి ఉన్న జిల్లాకు చెందిన వారు డీఐవో ఎన్ఐసీ ద్వారా సంబంధిత హెచ్ఐ్వడీలకు నామినేషన్లను సమర్పించాలని సూచించారు.
News July 1, 2024
MDK: పోలీసుల పేరుతో దాడి దోపిడీ
మెదక్ జిల్లాలో పోలీసుల పేరుతో పట్టపగలే దారి దోపిడీ జరిగింది. నంగనూరు మండలం పాలమాకులకు చెందిన చిత్తారి శర్మ నర్సాపూర్లో బంధువుల ఇంటికి వెళ్తున్నారు. బస్సు దిగి నడిచి వెళ్తుండగా వచ్చిన ఇద్దరు దుండగులు తాము పోలీసులమని చెప్పి అడ్డుకున్నారు. శర్మను ఒకరు పట్టుకోగా మరొకరు మెడలోని బంగారం గొలుసు, ఉంగరం తీసుకొని పారిపోయారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు SI పుష్పరాజ్ తెలిపారు.