News March 18, 2024
సిద్దిపేట: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: హరీశ్ రావు

10వ తరగతి పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆకాంక్షించారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఒక ప్రకటనలో శుభాశీస్సులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కష్టపడి చదివిన అంశాలను రాయాలని ఉత్తమ ఫలితాలతో ముందంజలో నిలవాలన్నారు.
Similar News
News September 3, 2025
టేక్మాల్: గణపతి లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు

టేక్మాల్లో గణపతి లడ్డూను ముస్లిం యువకుడు మతీన్ దక్కించుకున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం టేక్మాల్లోని నాగులమ్మ ఆలయం వద్ద గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి లడ్డూకు నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో గ్రామానికి చెందిన మతీన్ రూ. 21 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. నిర్వాహకులు అతనికి ఈ ఘటన మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది.
News September 3, 2025
మెదక్ జిల్లాలో 5,23,327 మంది ఓటర్లు

తుది ఓటరు జాబితా ప్రకారం మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు ఉన్నాయి. మొత్తం 5,23,327 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 2,51,532 మంది, మహిళలు 2,71,787 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. వార్డుకు ఒకటి చొప్పున మొత్తం 4,220 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తులో అధికారులు నిమగ్నమయ్యారు.
News September 3, 2025
MDK: అత్తింటి వేధింపులతో నవ వధువు సూసైడ్

చిన్నశంకరంపేటకు చెందిన రాధిక(19)కు నెల రోజుల క్రితం ఇంటి పక్కనే ఉన్న వానరాసి కుమార్(22)తో పెళ్లి అయింది. కాగా, అత్తింటి వేధింపులు భరించలేక<<17595482>> నవ వధువు రాధిక<<>> ఊరేసుకున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు. అయితే రాధిక తండ్రి రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. తల్లి, అన్న, చెల్లెలు గత ఏడాది చనిపోయారు. ప్రస్తుతం 15 ఏళ్ల తమ్ముడు, ఇద్దరు అక్కలు ఉండగా.. ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.