News March 17, 2024

సిద్దిపేట: నోడల్ అధికారులకు శిక్షణ: కలెక్టర్

image

లోక్ సభ ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల నోడల్ అధికారులుగా నియామకమైన వారికి శిక్షణ ఇస్తున్నట్టు కలెక్టర్ ఎన్నికల అధికారి మను చౌదరి తెలిపారు. విలేకరులతో మాట్లాడారు. మెదక్ లోక్ సభ పరిధిలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని, కరీంనగర్ లోక్సభ పరిధిలో హుస్నాబాద్ నియోజకవర్గం భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో జనగామ శాసనసభ పరిధికి సంబంధించి జిల్లాలోని నాలుగు మండలాలు ఉన్నాయన్నారు.

Similar News

News July 5, 2024

మెదక్: సదరం క్యాంప్ తేదీలు విడుదల

image

మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగులను గుర్తించి అర్హతగల వారికి సదరం ధ్రువీకరణ పత్రం పొందేందుకుగానూ జులై -2024 సంబందించిన క్యాంప్ తేదీలను మీ సేవ / ఈ సేవ కేంద్రాలకు కేటాయించినట్లు డీఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. దివ్యాంగులు తమ దగ్గరలో ఉన్న మీ సేవ/ ఈ సేవ కేంద్రం వద్ద ఆన్ లైన్‌లో స్లాటు బుక్ చేసుకొని కేటాయించిన రోజు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.

News July 5, 2024

ప్రజల్లో చైతన్యం నింపడంలో కవులు, రచయితలు ముందుండాలి: KCR

image

తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, MLC గోరేటి వెంకన్న ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలన్నారు.

News July 5, 2024

సిద్దిపేట: తల్లిని చంపి సహజ మరణంగా..

image

కొడుకు తల్లిని చంపి సహజ మరణంగా చిత్రీకరించాడు. పోలీసుల వివరాలు.. HYDకి చెందిన బాలకృష్ణమ్మ(54) కొడుకు సర్వేశ్, పక్కింటివారితో కలిసి నాచారంగుట్ట క్షేత్రానికి వచ్చింది. రాత్రి ఆమె అస్వస్థతకు గురి కాగా కొడుకు అసహనంతో తల్లి తలను నేలకేసి కొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయింది. సహజ మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంట వెళ్లిన వారి ద్వారా అసలు విషయం తెలుసుకుని ఆమె కుమార్తె సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.