News October 23, 2024
సిద్ధిఖీ హత్య.. నిందితుడికి టెన్త్లో 78% మార్కులు!

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన షూటర్స్లో ఒకడైన UPకి చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ గురించి ఆసక్తికర విషయం తెలిసింది. అతను టెన్త్ క్లాస్లో 78శాతం మార్కులు సాధించినట్లు ధర్మరాజ్ సోదరుడు తెలిపారు. నాడు ధర్మరాజ్ను మెడిసిన్ చదివించాలని తల్లిదండ్రులు భావించినట్లు చెప్పాడు. అయితే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను చూసి ఆకర్షితుడయ్యాడని, డబ్బు కోసం తప్పుదారి పట్టాడని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
ఐబొమ్మకు ఇక సెలవు

అనధికారిక (పైరసీ) మూవీ వెబ్సైట్ iBOMMAకు ‘సెలవు’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెలకు రూ.వేలల్లో చెల్లించి OTTలో మూవీలు చూడలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేసుకుంటున్నారు. అయితే దీనివల్ల థియేటర్లకు వెళ్లేవారు తగ్గారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల ‘పైరసీకి సెలవు’ అంటూ మరికొందరు స్వాగతిస్తున్నారు. ఐబొమ్మ క్లోజ్ అవ్వడం సినీ పరిశ్రమకు, OTT ప్లాట్ఫారమ్లకు ఉపశమనం కలిగించింది.
News November 17, 2025
ఐబొమ్మకు ఇక సెలవు

అనధికారిక (పైరసీ) మూవీ వెబ్సైట్ iBOMMAకు ‘సెలవు’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెలకు రూ.వేలల్లో చెల్లించి OTTలో మూవీలు చూడలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేసుకుంటున్నారు. అయితే దీనివల్ల థియేటర్లకు వెళ్లేవారు తగ్గారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల ‘పైరసీకి సెలవు’ అంటూ మరికొందరు స్వాగతిస్తున్నారు. ఐబొమ్మ క్లోజ్ అవ్వడం సినీ పరిశ్రమకు, OTT ప్లాట్ఫారమ్లకు ఉపశమనం కలిగించింది.
News November 17, 2025
‘షూ బాంబర్’.. ఢిల్లీ పేలుడులో కీలక పరిణామం!

ఢిల్లీ పేలుడు కేసులో కీలక ముందడుగు పడింది. డా.ఉమర్ నబీ i20 కారును ‘షూ బాంబర్’తో పేల్చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. బ్లాస్ట్ అయిన కారు ముందు భాగంలో షూను కనుగొన్న అధికారులు అందులో మెటల్ లాంటి వస్తువును గుర్తించారు. దీంతో బాంబును యాక్టివేట్ చేయడానికి ఉమర్ షూ ట్రిగ్గర్ను ఉపయోగించినట్లు భావిస్తున్నారు. కాగా ఈ నెల 10న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 10 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు.


