News May 11, 2024
రాష్ట్రంలో రూ.320 కోట్ల సొత్తు సీజ్: వికాస్ రాజ్

TG: రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సోదాల్లో రూ.320 కోట్ల సొత్తు సీజ్ చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. 48 గంటల్లో వచ్చే ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ దగ్గర పడటంతో నిఘా మరింత పెరుగుతుందని తెలిపారు. ఎల్లుండి రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
Similar News
News November 17, 2025
iBOMMA రవి భార్య వల్ల దొరికిపోయాడా? క్లారిటీ ఇదే!

iBOMMA నిర్వాహకుడు రవి భార్యతో విడాకులు తీసుకునేందుకు వచ్చి పోలీసులకు దొరికిపోయాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదు. అతడికి ఐదేళ్ల క్రితమే విడాకులయ్యాయి. ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి రవికి చెల్లింపుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఐపీ అడ్రస్ లభించింది. అది మూసాపేట్లోని విస్టా అపార్ట్మెంట్స్ అని గుర్తించి నిఘా ఉంచారు. 2 రోజుల క్రితం అతడు ఫ్రాన్స్ నుంచి తిరిగి రాగానే అరెస్టు చేశారు.
News November 17, 2025
శ్రీ వేంకటేశ్వర వర్సిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో 24 అకడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. M.Phil/PhD అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి. వెబ్సైట్: https://svuniversityrec.samarth.edu.in
News November 17, 2025
అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు (2/2)

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.


