News October 26, 2024
సంతకం చేసి రూ.8కోట్లు గెలుచుకుంది!
అమెరికా రాజ్యాంగానికి మద్దతుగా తన ఆన్లైన్ పిటిషన్పై సంతకం చేసిన వ్యక్తికి ప్రతిరోజూ $1 మిలియన్ (సుమారు రూ. 8.40 కోట్లు) ఇస్తామని బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పిటిషన్పై సంతకం చేసిన నెవడాలోని పహ్రంప్కు చెందిన మేరీ 1 మిలియన్ డాలర్లు పొందారు. మేరీని అభినందిస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఎన్నికల రోజు వరకు ప్రతిరోజూ సంతకం చేసిన ఒకరిని ఎంపిక చేసి ఈ బహుమతి ఇస్తారు.
Similar News
News October 26, 2024
ప్రాణ త్యాగం చేసైనా వక్ఫ్ బిల్లును అడ్డుకుంటాం: మౌలానా ఖలీద్
వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా అన్నారు. ‘ఇది మాకు జీవన్మరణ సమస్య. ప్రతిపాదిత సవరణ బిల్లు అమలును అడ్డుకొని తీరుతాం. అవసరమైతే ముస్లింలు జైల్ భరో కార్యక్రమాలు చేపడతారు’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వమే అత్యధికంగా వక్ఫ్ ఆస్తులను ఆక్రమించిందని మౌలానా ఆరోపించారు.
News October 26, 2024
క్రెడిట్ కార్డులపై బ్యాంకుల దీపావళి ఆఫర్స్
కస్టమర్లకు బ్యాంకులు గుడ్న్యూస్ చెప్పాయి. దీపావళి, ధంతేరాస్ షాపింగ్ చేసేందుకు క్రెడిట్ కార్డుపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ షాపింగ్, ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్, గోల్డ్ జువెలరీ, మొబైళ్లు, దుస్తుల కొనుగోలుపై ICICI, HDFC, AXIS BANKS, SBI కార్డ్స్ డీల్స్ ప్రకటించాయి. జియో మార్ట్, జొమాటో, స్విగ్గీ, యాపిల్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్, మింత్రా, తనిష్క్తో టైఅప్స్ పెట్టుకున్నాయి.
News October 26, 2024
BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
AP: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. శింగనమల మం. నాయనపల్లి క్రాస్ వద్ద కారు టైర్ పగలడంతో అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్కు చెందిన భక్తులుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.