News October 26, 2024
సంతకం చేసి రూ.8కోట్లు గెలుచుకుంది!

అమెరికా రాజ్యాంగానికి మద్దతుగా తన ఆన్లైన్ పిటిషన్పై సంతకం చేసిన వ్యక్తికి ప్రతిరోజూ $1 మిలియన్ (సుమారు రూ. 8.40 కోట్లు) ఇస్తామని బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పిటిషన్పై సంతకం చేసిన నెవడాలోని పహ్రంప్కు చెందిన మేరీ 1 మిలియన్ డాలర్లు పొందారు. మేరీని అభినందిస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఎన్నికల రోజు వరకు ప్రతిరోజూ సంతకం చేసిన ఒకరిని ఎంపిక చేసి ఈ బహుమతి ఇస్తారు.
Similar News
News November 23, 2025
HYD: నగరవాసులకు జలమండలి విజ్ఞప్తి

గుర్తు తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని జలమండలి అధికారులు సూచించారు. నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని కొందరు వినియోగదారులను SMS ద్వారా బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి మెసేజ్లకు స్పందించకూడదని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సందేశాల్లో వచ్చే APK డౌన్లోడ్ చేయొద్దన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే కస్టమర్ కేర్ నం. 155313ని సంప్రదించాలని కోరారు.
News November 23, 2025
TODAY HEADLINES

* సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము
* డ్రగ్స్-టెర్రర్ లింక్ను నాశనం చేయాలి: మోదీ
* సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి
* అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ సాకారం కాలేదు: రేవంత్
* కొత్త లేబర్ కోడ్లు.. గొప్ప సంస్కరణల్లో ఒకటి: CBN
* TG పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల
* బెంగళూరులో ప్రైవేట్ ఈవెంట్లో ఒకే వేదికపై జగన్, కేటీఆర్
News November 23, 2025
ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదు: శ్రీధర్ బాబు

TG: ఆరోపణలు చేయడం, అబద్ధాలు చెప్పడం కేటీఆర్, <<18359759>>హరీశ్<<>> రావుకు అలవాటేనని మంత్రి శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. భూముల ధరలపై చేస్తున్న వ్యాఖ్యలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఫ్రీ హోల్డ్ జీవోల వెనుక ఉన్న రూ.లక్షల కోట్ల మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.


