News July 6, 2024
సికిందర్ రజా అరుదైన రికార్డు

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించారు. ఈ ఫార్మాట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఆయన 15 POTMలు అందుకున్నారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (15) రికార్డును ఆయన సమం చేశారు. కాగా అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ (16) ఉన్నారు.
Similar News
News March 21, 2026
వారంలో ఐపీఎల్.. ఆ ప్లేయర్లు ఆడటం డౌటే!

వారంలో IPL మొదలవనుండగా తమ క్రికెటర్లకు శ్రీలంక క్రికెట్ బోర్డు మెలిక పెట్టింది. ఫ్రాంచైజీ లీగ్లలో ఆడేందుకు NOC ఇవ్వాలంటే ఫిట్నెస్ పరీక్షల్లో పాసవ్వాలని స్పష్టం చేసింది. DC ప్లేయర్లు చమీరా, నిస్సంక, కమిందు మెండిస్(SRH) ఫిజికల్ టెస్టును క్లియర్ చేశారు. గాయాల పాలైన హసరంగ(LSG), నువాన్ తుషార(RCB), పతిరణ(KKR), ఈషాన్ మలింగ(SRH) ఇంకా టెస్టులో పాల్గొనలేదు. దీంతో వీరు IPLలో పాల్గొనడంపై అనుమానం నెలకొంది.
News March 21, 2026
వచ్చే వారం భీకర దాడులు: ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించట్లేదు. వచ్చే వారం ఇరాన్పై దాడుల తీవ్రతను పెంచుతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ వెల్లడించారు. ఇరాన్ అడ్మినిస్ట్రేషన్, కమాండర్లు, కీలక స్థావరాలను టార్గెట్ చేస్తామన్నారు. ఇరాన్పై దాడులను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కట్జ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
News March 21, 2026
ఆకాశంలోనే జీవితం.. కాపురం కూడా!

ప్రకృతిలో ‘కామన్ స్విఫ్ట్’ అనే పక్షి ఓ అద్భుతం. ఏకధాటిగా 10 నెలల పాటు భూమిపై వాలకుండా ఆకాశంలోనే జీవించగలిగే సామర్థ్యం దీని సొంతం. వింత ఏమిటంటే.. ఇది గాలిలోనే ఆహారం తింటుంది, జతకడుతుంది, చివరికి ఎగురుతూనే నిద్రపోతుంది. కేవలం గుడ్లు పెట్టడానికి మాత్రమే ఈ పక్షి నేలపైకి వస్తుంది. మెదడులో సగభాగాన్ని అలర్ట్గా ఉంచి గాల్లోనే నిద్రపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో


