News October 26, 2024

Silver Shining: బంగారం కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన వెండి

image

ఈసారి బంగారం మెరుపుల్ని వెండి డామినేట్ చేసింది! ఈ ఏడాది ఇప్పటి వరకు 30% రిటర్న్ ఇచ్చింది. ఇక పుత్తడి 23%, నిఫ్టీ 15% రాబడి అందించాయి. గత OCTలో కేజీ సిల్వర్ రూ.73వేలు ఉండగా ఇప్పుడు రూ.లక్షా పదివేలకు చేరుకుంది. ఈ మెటల్‌ను నగలు, పాత్రలకే కాకుండా ఇండస్ట్రీస్‌లోనూ వాడతారు. ధరలు ఎక్కువ ఆటుపోట్లకు లోనవుతాయి కాబట్టి పోర్టుఫోలియోలో వెండి కన్నా బంగారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News November 19, 2025

భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

image

భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య డిసెంబర్‌లో జరగాల్సిన సిరీస్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాతో సిరీస్‌కు తమకు పర్మిషన్ రాలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌లో ప్రత్యామ్నాయ సిరీస్‌కు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించాయి. కాగా షెడ్యూల్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది.

News November 19, 2025

వినాయకుడిని ఏ సమయంలో పూజించడం ఉత్తమం?

image

బుధవారం వినాయకుడి పూజలకు శ్రేష్ఠం. ఉదయంతో పోల్చితే సాయంత్ర పూజల వల్ల విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. స్కంద పురాణం ప్రకారం.. సంధ్యా సమయంలో స్వామివారిని పూజిస్తే మనలోని ప్రతికూల శక్తులన్నీ హరించుకుపోతాయి. కొబ్బరి నూనె దీపం వెలిగించి, 21 గరికెలు సమర్పించి, గణేశుడి పంచరత్న స్తోత్రాన్ని పఠిస్తే.. బుద్ధి చతురత, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

News November 19, 2025

దివిసీమ జల ప్రళయానికి 48 ఏళ్లు

image

AP: దివిసీమ జల ప్రళయానికి నేటితో 48 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19న కడలి ఉప్పొంగడంతో ఊళ్లు శవాల దిబ్బలుగా మారాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి తదితర ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎంతో మంది జల సమాధి అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం 14 వేల మందికిపైగా చనిపోయారు. ఘటన జరిగిన 3 రోజుల వరకు బాహ్య ప్రపంచానికి ఈ విషయం తెలియకపోవడం అత్యంత బాధాకరం.