News April 7, 2025

రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం

image

AP: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు రాత్రి అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. రేపు మధ్యాహ్నం కొట్నాల ఉత్సవం, ఎదురు సన్నాహం పూర్తవుతాయి. రాత్రి 8గంటలకు రథోత్సవం, 9.30గంటలకు స్వామి కళ్యాణ మహాత్సవం జరుగుతాయి.

Similar News

News November 1, 2025

వర్షం పడదంటున్నా ₹34 కోట్లతో క్లౌడ్ సీడింగ్

image

ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ విఫలమవడం తెలిసిందే. కాన్పూర్ IITతో కలిసి మేఘమథనం చేసినా వాన పడలేదు. అయితే ఢిల్లీ వాతావరణం క్లౌడ్ సీడింగ్‌కు అనుకూలమైనది కాదని CAQM, CPCB, IMD నిర్ధారించాయని 2024లోనే పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రకటించింది. అయినా ఢిల్లీ ప్రభుత్వం ₹34 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి ఇప్పటికే ₹3కోట్ల వెచ్చించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగంపై పలువురు మండిపడుతున్నారు.

News November 1, 2025

మీ కొడుకుని సూపర్ హీరోగా పెంచండి!

image

ప్రస్తుత టెక్‌యుగంలో పిల్లలు మంచి కన్నా చెడుకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే వారికి చిన్నప్పటి నుంచే మంచి విషయాలపై అవగాహన కల్పించాలి. తోటివారిని గౌరవించడం, ఇతరుల వద్దకు వెళ్తే అనుమతి అడగడం, ఓర్పుతో ఉండటం, నిజాయతీగా మెలగడం వంటివి నేర్పాలని నిపుణులు చెబుతున్నారు. స్త్రీల పట్ల గౌరవం, సహానుభూతి చూపడం మంచి లక్షణాలని చెప్పండి. న్యాయం కోసం నిలబడే గుణాలను నేర్పిస్తే ఆదర్శవంతుడిగా ఎదుగుతాడు.

News November 1, 2025

కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

image

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో 10మంది భక్తులు మృతి చెందడంపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం దురదృష్టకరమని Dy.CM పవన్ ట్వీట్ చేశారు.