News December 14, 2024

రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి తనిఖీలు

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా 40 అధికారుల బృందాలు ఎరువుల దుకాణాలు, గిడ్డంగులపై ఒకేసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఎరువులను అధిక ధరకు అమ్ముతున్నట్లు, లైసెన్సులు లేకుండా విక్రయాలు, తూకాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించాయి. కొన్నిచోట్ల వ్యాపారులు రికార్డులు సరిగా నిర్వహించలేదని తేల్చాయి. రైతులను ఇబ్బంది పెట్టవద్దని, రాష్ట్ర‌వ్యాప్తంగా దాడులు ఇలాగే కొనసాగుతాయని విజిలెన్స్ DG ప్రకటించారు.

Similar News

News November 18, 2025

ఇంట్లో అవమానాలు.. iBomma రవి కథలో షాకింగ్ ట్విస్ట్

image

పోలీసుల విచారణలో iBomma రవి వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు బయటకు వచ్చాయి. అవమానాలే అతణ్ని డబ్బు సంపాదన దారిలోకి నెట్టినట్లు తెలుస్తోంది. ‘డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు’ అంటూ ప్రేమించి పెళ్లాడిన భార్య, అత్త హేళన చేసేవారు. అవమానాలను తట్టుకోలేక తన వెబ్‌డిజైన్ నైపుణ్యంతో iBomma, BAPPAM సైట్లను రూపొందించాడు. భారీగా వచ్చిన డబ్బుతో జీవితం మారినా, భార్య తిరిగి రాలేదు. 2021లో యూరప్‌కు మకాం మార్చాడు.

News November 18, 2025

ఇంట్లో అవమానాలు.. iBomma రవి కథలో షాకింగ్ ట్విస్ట్

image

పోలీసుల విచారణలో iBomma రవి వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు బయటకు వచ్చాయి. అవమానాలే అతణ్ని డబ్బు సంపాదన దారిలోకి నెట్టినట్లు తెలుస్తోంది. ‘డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు’ అంటూ ప్రేమించి పెళ్లాడిన భార్య, అత్త హేళన చేసేవారు. అవమానాలను తట్టుకోలేక తన వెబ్‌డిజైన్ నైపుణ్యంతో iBomma, BAPPAM సైట్లను రూపొందించాడు. భారీగా వచ్చిన డబ్బుతో జీవితం మారినా, భార్య తిరిగి రాలేదు. 2021లో యూరప్‌కు మకాం మార్చాడు.

News November 18, 2025

టెన్త్ పరీక్షలపై BIG UPDATE

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 16 లేదా 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆ రెండు తేదీల ప్రకారం టైం టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిలో ఓ దానికి ఆమోదం లభించనుంది. ఈసారి 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 3,500 సెంటర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 35వేల మంది ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ మొదలైంది.