News March 25, 2025

ATM నుంచి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా ఎప్పటినుంచంటే?

image

పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కేంద్రం తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని మే నెలాఖరు లేదా జూన్ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మికశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు. అయితే విత్‌డ్రా లిమిట్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విధానంతో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

Similar News

News November 27, 2025

ఇండస్ట్రియల్ పాలసీపై అసత్య ప్రచారం: ఉత్తమ్

image

TG: ఇండస్ట్రియల్ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌ని కాలుష్యరహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకి పంపాలన్న డిమాండ్ ఉంది. ఇది మేం కొత్తగా తెచ్చిన పాలసీ కాదు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయి. BRS హయాంలోనూ దీనిపై చర్చ జరిగింది. విద్యుత్‌లో రూ.50 వేల కోట్లు కాదు రూ.50 వేల కుంభకోణం కూడా జరగలేదు’ అని తెలిపారు.

News November 27, 2025

పన్ను ఊడిపోయిందా? డెంటల్ ఇంప్లాంట్ అవసరం లేదు!

image

ఊడిపోయిన దంతాల ప్లేస్‌లో కొత్తవి వచ్చే విధంగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు బయోయాక్టివ్ ప్యాచ్‌ను ఆవిష్కరించారు. ఇది కృత్రిమ దంతాలకు ప్రత్యామ్నాయంగా దవడలోని స్టెమ్ సెల్‌లను చురుకుగా మారుస్తుంది. ఇది పూర్తి దంత నిర్మాణాన్ని సహజంగా పెంచుతుంది. పన్ను పోయిన చోట ఈ ప్యాచ్‌ను అమర్చితే చిగుళ్లలోపలి నుంచి కొత్త పన్ను వస్తుంది. మానవులపై జరిపే క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే ఎంతో మందికి ఇది ఉపయోగపడనుంది.

News November 27, 2025

జీవో 46పై విచారణ రేపటికి వాయిదా

image

TG: ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఈ జీవో జారీ చేయడంతో వెనుకబడిన కులసంఘాలు పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్‌ అత్యవసర పిటిషన్‌గా విచారణ చేపట్టాలని కోరారు. బీసీలలో A, B, C, D వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.