News September 22, 2025
ప్రభుత్వానికి సింగరేణి ఆత్మలాంటిది: భట్టి

TG: రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి ఆత్మలాంటిదని కార్మికులకు <<17791980>>బోనస్<<>> ప్రకటన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి నిర్ణయించినట్లు చెప్పారు. గత పదేళ్లుగా సంస్థ వేలంలో పాల్గొనకపోవడంతో రెండు బ్లాక్లను కోల్పోయిందన్నారు. దీంతో ఆ రెండు బ్లాక్లు అప్పటి ప్రభుత్వ నేతల సన్నిహితుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు.
Similar News
News September 22, 2025
నవరాత్రి ఉత్సవాలు.. ఉపవాసం ఉంటున్నారా?

నవరాత్రుల సందర్భంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే సరైన జాగ్రత్తలు పాటించకపోతే త్వరగా అలసిపోవడం, తల తిరగడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు తినడం, రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం, ఫైబర్, ప్రొటీన్, ఆహారంలో కార్బోహైడ్రేట్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవడం వంటి చిట్కాల ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.
News September 22, 2025
₹500 కోట్లతో NTTPS కాలుష్య నివారణ పనులు

AP: NTTPS కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. పొల్యూషన్ రాకుండా ప్లాంటులో ₹500కోట్లతో పరికరాలు సమకూరుస్తున్నామన్నారు. ’పాండ్యాష్ నిల్వ, తరలింపుతోనే ఈ సమస్య. కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు, యాష్ రవాణాకు టెండరింగ్ ఏజెన్సీని నియమించాం. ఏజెన్సీ ఏర్పాటుపై అపోహలొద్దు.’ అని పేర్కొన్నారు. స్థానికుల ఉపాధి దృష్ట్యా ఉచితంగా బూడిద లోడింగ్, రవాణా ఖర్చులు అందిస్తున్నామన్నారు.
News September 22, 2025
రాష్ట్రంలో 42 పోస్టులు.. దరఖాస్తుల సవరణకు కొన్ని గంటలే ఛాన్స్

<