News August 27, 2024
రాజ్యసభ MPగా సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. కె.కేశవరావు MP పదవికి రాజీనామా చేసి BRS నుంచి కాంగ్రెస్లోకి మారడంతో ఆ స్థానం ఖాళీగా మారింది. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సింఘ్వీని నామినేట్ చేసింది.
Similar News
News March 4, 2026
ఇరాన్ అణుబాంబు ప్రయోగంపై కీలక వ్యాఖ్యలు

యుద్ధం వేళ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం అణుబాంబు సిద్ధంగా లేదని, తయారు చేస్తోందనడానికి ఆధారాలూ లేవన్నారు. కానీ ఆ దేశం దగ్గర యురేనియం నిల్వలు ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు. ఇరాన్ అణుబాంబు ప్రయోగిస్తుందనే ప్రచారంపై స్పష్టత లేదన్నారు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందని ఆరోపిస్తూ US, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగాయి.
News March 4, 2026
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 19వరకు పంపాలి. పోస్టును బట్టి పీజీ, పీజీ(ఫిజికల్ ఎడ్యుకేషన్) MLSc, PhD, NET/SET/SLET, CA/CS/ICWA, BEd, MEd, మెడికల్ పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://careers.amuonline.ac.in/
News March 4, 2026
నెయ్యి సరఫరాలో చంద్రబాబు స్కామ్లు: జగన్

AP: CM చంద్రబాబు తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని జగన్ Xలో విమర్శించారు. ‘TTD ఛైర్మన్పై ఓ మహిళ ఫిర్యాదు చేస్తే CBN చర్యలు తీసుకోలేదు. అతడినే పదవిలో కొనసాగించి ఆలయ ప్రతిష్ఠను కాలరాశారు. లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరికి మీదికి నెట్టారు. నెయ్యి సరఫరాను ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టి స్కామ్లు చేస్తూ సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు’ అని ఆరోపిస్తూ <


