News May 24, 2024
RCB నుంచి సిరాజ్, యశ్ దయాల్ ఔట్?

బెంగళూరు స్టేడియంలో మ్యాచులు గెలవాలంటే బౌలర్లకు పేస్ మాత్రమే ఉంటే సరిపోదని RCB కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నారు. స్పెషల్ స్కిల్స్ ఉన్నవారు, ప్లాన్ను పక్కాగా అమలు చేసే తెలివైన బౌలర్లు కావాలని అభిప్రాయపడ్డారు. అలాగే తమ జట్టుకు పవర్ హిట్టర్స్ అవసరం ఉందని చెప్పారు. 2025లో మెగా వేలం నేపథ్యంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సిరాజ్, దయాల్ సహా ఇతర బౌలర్లను ఆ జట్టు వదులుకోనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Similar News
News October 17, 2025
అమరావతికి స్టార్ హోటళ్ల కళ

AP: అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా ప్రముఖ స్టార్ హోటళ్లు కొలువుదీరేలా ఏర్పాట్లు చేస్తోంది. దసపల్లా ₹200 కోట్లతో, SGHRL ₹177 కోట్లతో 4స్టార్ హోటళ్లను నెలకొల్పనున్నాయి. VHR సంస్థ అరకులో ₹56 కోట్లతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించడానికి ప్రతిపాదించింది. వీటికి 10 ఏళ్లవరకు SGST, 5 ఏళ్ల వరకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
News October 17, 2025
కోహ్లీ వరల్డ్ రికార్డు సృష్టిస్తాడా?

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 7 నెలల తర్వాత ఈనెల 19న AUSతో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ సిరీస్లో తను వరల్డ్ రికార్డు నెలకొల్పే అవకాశముంది. 3 మ్యాచ్ల్లో ఒక్క సెంచరీ చేసినా 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా నిలుస్తారు. సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా విరాట్ వన్డేల్లో 51 శతకాలు బాదారు. మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును అతడు అధిగమిస్తారు.
News October 17, 2025
జపాన్ మాజీ ప్రధాని కన్నుమూత

జపాన్ మాజీ ప్రధాని టొమిచి మురయమా(101) అనారోగ్యంతో కన్నుమూశారు. ఫాదర్ ఆఫ్ జపాన్ పాలిటిక్స్గా పిలవబడే మురయమా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ వెల్లడించింది. ఆయన 1994 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేశారు. వరల్డ్ వార్-2 సమయంలో ఆసియాలో జపాన్ చేసిన దారుణాలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.