News October 7, 2024

రూ.35,000 కోసం పెళ్లి చేసుకున్న అన్నాచెల్లెళ్లు!

image

ప్రభుత్వం అమలు చేస్తున్న సామూహిక వివాహ పథకం ప్రయోజనాలు (రూ.35,000) పొందడం కోసం అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్న ఘటన యూపీలో జరిగింది. ఈ ఏడాది మార్చి 5న ఈ ఘటన జరగగా, స్థానికుల సమాచారంతో అధికారులు తాజాగా చర్యలకు ఉపక్రమించారు. యువతికి ఇదివరకే వివాహం జరగగా, డబ్బుల కోసం మరోసారి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు. వరుడు సమయానికి రాకపోవడంతో వధువు, ఆమె సోదరుడు పెళ్లి చేసుకున్నారు.

Similar News

News March 4, 2026

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్లస్టర్ బాంబులు!

image

ఇరాన్ తమ భూభాగంపైకి బాలిస్టిక్ మిస్సైళ్లతో క్లస్టర్ బాంబులు వదులుతోందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. టెల్ అవీవ్ సమీపంలో ఈ బాంబు వల్ల 12 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇది గాల్లో ఉన్నప్పుడే 80 చిన్న బాంబులుగా విడిపోయి కొన్ని కి.మీ. మేర విధ్వంసం సృష్టిస్తాయి. కొన్నిసార్లు పేలకుండా దశాబ్దాల పాటు భూమిలో ఉండిపోతాయి. ఏదైనా తాకితే పేలిపోతాయి. ఈ యుద్ధంలో వీటిని ఉపయోగించడం ఇదే తొలిసారి.

News March 4, 2026

దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. 18న ప్రారంభం

image

AP: దివ్యాంగులకు బస్సులో ఉచిత ప్రయాణం(ఇంద్ర ధనుస్సు స్కీమ్)పై RTC MD బాలసుబ్రహ్మణ్యం కీలక ప్రకటన చేశారు. ఈ పథకాన్ని ఈ నెల 18న సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చన్నారు. వారికి సహాయంగా వచ్చేవారికీ 50 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు.

News March 4, 2026

మండుతున్న ఎండలు.. భారీగా బీర్ల అమ్మకాలు

image

TG: రాష్ట్రంలో బీర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఎండలు మండుతుండడంతో వీటి అమ్మకాలు సాధారణం కన్నా 40% పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి MAR చివర్లో బీర్లకు డిమాండ్ ఏర్పడుతుంటుంది. కానీ ఈసారి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆరంభంలోనే ఆ పరిస్థితి ఉంది. ఇక HYDలో నెలాఖరు నుంచి బీరు అమ్మకాలు పెరుగుతాయి. ఈ అమ్మకాల ద్వారా వేసవి 3మాసాల్లో ₹7000 CR GOVTకి రానున్నాయి.