News May 19, 2024
తిరుపతిలో సిట్ దర్యాప్తు

AP: తిరుపతి ఎస్వీయూ క్యాంపస్లో ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎస్వీయూ పీఎస్లో నమోదైన కేసులు, FIRల వివరాలను పరిశీలించింది. అనంతరం పద్మావతి మహిళా వర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనపై విచారణ చేసింది. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
Similar News
News March 2, 2026
దానం, కడియంలకు స్పీకర్ నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు MLAలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. MLAలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై BRS MLAలు KP వివేకానంద్, పాడి కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఇప్పటికే తాము పార్టీ మారలేదని కడియం, దానం స్పీకర్కు రిప్లై ఇచ్చారు. అయితే తగిన ఆధారాలతో విచారణకు రావాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 4న వీరిని విచారణ చేయనున్నారు.
News March 2, 2026
అమెరికాతో చర్చల ప్రసక్తే లేదు: ఇరాన్

అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ స్పష్టం చేశారు. చర్చల పునరుద్ధరణకు తమ నుంచి ప్రతిపాదనలు వచ్చాయంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఇజ్రాయెల్ ఆధిపత్య లక్ష్యాల కోసం ట్రంప్ తమ సైనికులను పణంగా పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యాధిపతి భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
News March 2, 2026
చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. రంగులు చల్లుకోవచ్చా?

మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున ఆ రోజు రంగులు చల్లుకోవడం చేయకూడదని జ్యోతిషులు హెచ్చరిస్తున్నారు. గ్రహణ సమయంలో పూజలు, వేడుకలు చేయకూడదంటున్నారు. అయితే ఈ సమయంలో చేసే మంత్ర జపం, అనుష్టానాలకు వేల రెట్లు అధిక ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణ ప్రభావం ముగిసిన తర్వాత, అంటే మార్చి 4న ఎలాంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రంగుల హోలీని వైభవంగా జరుపుకోవచ్చని సూచిస్తున్నారు.


