News May 19, 2024

తిరుపతిలో సిట్ దర్యాప్తు

image

AP: తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లో ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎస్వీయూ పీఎస్‌లో నమోదైన కేసులు, FIRల వివరాలను పరిశీలించింది. అనంతరం పద్మావతి మహిళా వర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనపై విచారణ చేసింది. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

Similar News

News February 27, 2026

తడబడిన న్యూజిలాండ్.. స్కోర్ ఎంతంటే?

image

T20WC: ENGతో జరుగుతున్న మ్యాచులో న్యూజిలాండ్ తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 రన్స్ చేసింది. సీఫర్ట్ 35, అలెన్ 29, ఫిలిప్స్ 39 రన్స్ చేశారు. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. రషీద్, జాక్స్, రెహన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచులో ENG గెలిస్తే పాకిస్థాన్ సెమీస్ వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ NZ గెలిస్తే పాక్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది.

News February 27, 2026

DINK జంటలకూ డబ్బు సరిపోవట్లేదు!

image

పిల్లల బాధ్యత, ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు చాలా జంటలు డ్యుయల్ ఇన్‌కమ్, నో కిడ్స్ (DINK) పాలసీని ఫాలో అవుతున్నాయి. కానీ వీరిలో చాలా మందికి సంపాదన సరిపోవడం లేదు. పొదుపుపై దృష్టి పెట్టకుండా ఆదాయాన్ని ఖర్చులు, జల్సాలకు వాడుకోవడం.. ఒకరి ఖర్చులు మరొకరు పట్టించుకోకపోవడం, ఆదాయానికి తగినట్టు ఖర్చులు పంచుకోకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆదాయంతో సంపద పెరుగుతుంది అనుకోవడం పొరపాటని నిపుణులు చెబుతున్నారు.

News February 27, 2026

మార్చి 28న ఐపీఎల్ ప్రారంభం?

image

ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 28న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబరులో BCCI ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీని మార్చి 26గా ప్రకటించింది. అయితే అస్సాం, బెంగాల్, తమిళనాడు ఎన్నికల తేదీలపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ప్రారంభ తేదీని 28కు మార్చినట్లు క్రిక్ఇన్ఫో వెల్లడించింది. ఫైనల్ మే 31న జరగనుందని తెలిపింది. కాగా వచ్చే వారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.