News June 10, 2024

డీజీపీ కార్యాలయానికి చేరిన సిట్ నివేదిక

image

AP ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై 264 పేజీలతో కూడిన పూర్తి నివేదికను డీజీపీకి సిట్ సమర్పించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 37 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఇందులో 6 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. నిందితుల్ని ప్రశ్నించకపోవడం, సరైన సెక్షన్లు నమోదు చేయకపోవడం వంటి అంశాల్లో పల్నాడు జిల్లా పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని అభిప్రాయపడింది.

Similar News

News November 23, 2025

రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గ్లోబల్ సమ్మిట్‌

image

DEC 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో TG ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు 2వేల మంది ప్రముఖులు రానున్నారు. రాష్ట్ర లక్ష్యాలు, ప్రణాళికలు వివరించేలా ప్రభుత్వం ‘TG రైజింగ్-2047’ డాక్యుమెంట్‌ను రూపొందించి ఆవిష్కరించనుంది. ఈ నెల 25 నుంచి CM రేవంత్ వివిధ శాఖలతో సమీక్షించి డాక్యుమెంట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచడం, భారీగా పెట్టుబడులను ఆకర్షించడం దీని లక్ష్యం.

News November 23, 2025

మూర్ఛ జన్యుపరమైన సమస్య

image

ఫిట్స్ ఒక దీర్ఘకాలిక రుగ్మత. దాదాపు 70% మూర్ఛ కేసులు జన్యుపరమైన కారణాలతో సంబంధం కలిగి ఉంటాయని వారు పేర్కొంటున్నారు. 2018లో ‘Neuron’ జర్నల్​లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 622 మంది మూర్ఛ రోగుల DNAను అధ్యయనం చేయగా వారిలో మూర్ఛ వ్యాధికి కారణమయ్యే 19 కొత్త జన్యువులను పరిశోధకులు గుర్తించారట. ఈ జన్యు మార్పులు మెదడు కణాల మధ్య సంకర్షణను దెబ్బతీస్తాయని, ఫలితంగా మూర్ఛ వస్తుందని నిపుణులు గుర్తించారు.

News November 23, 2025

అంబానీ స్కూల్.. ఫీజులు తెలిస్తే షాకే!

image

అంబానీ ఫ్యామిలీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (ముంబై) ఏడాది ఫీజులపై నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
*కిండర్‌గార్టెన్ నుంచి 7వ తరగతి: రూ.1.70 లక్షలు
*8-10th (ICSE): రూ.1.85 లక్షలు
*8-10th (IGCSE): రూ.5.9 లక్షలు
*11-12th (IBDP): రూ.9.65 లక్షలు
> షారుఖ్ ఖాన్, కరీనాకపూర్, ఐశ్వర్యరాయ్‌తో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు ఇక్కడ చదువుతున్నారు.