News May 20, 2024

ఏపీ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందించిన SIT

image

AP: ఎన్నికల రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సిట్ బృందం నివేదిక రూపొందించి.. డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తాకు అందజేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిలాల్లో మొత్తం 33 చోట్ల అల్లర్లు జరిగినట్లు అందులో పేర్కొంది.
1370 మందిపై FIR నమోదు చేయగా.. 124 మందిని అరెస్ట్ చేశామని, 94 మందికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీ.. కాసేపట్లో సీఈవో, సీఈసీకి పంపనున్నారు.

Similar News

News November 28, 2025

సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

image

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.

News November 28, 2025

NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NABARD<<>>లో 91పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, PG, MBA/PGDM, CA/CS/CMA/ICWA, PhD, BBA, BMS, BE, B.Tech, LLB/LLM ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ DEC 20న, మెయిన్స్ JAN 25న నిర్వహిస్తారు. ఆసక్తిగల SC/ST/OBC/PWBDలకు DEC 8 – DEC 19 వరకు ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ ఇస్తారు.

News November 28, 2025

సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.