News April 6, 2025

ఒంటిమిట్టలో 11న సీతారాముల కళ్యాణం

image

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం, ఏపీ ప్రభుత్వం ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు జరుపుతున్నాయి. భద్రాచలంలో శ్రీరామనవమి రోజు రాములోరి కళ్యాణం జరుపుతుండగా, ఒంటిమిట్టలో మాత్రం చతుర్దశి, పున్నమి రోజు చంద్రుడు వీక్షించేలా రాత్రి సమయంలో కళ్యాణం నిర్వహిస్తారు. ఈ సారి ఏప్రిల్ 11న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో కళ్యాణం జరగనుంది.

Similar News

News April 7, 2025

మూడు రోజుల్లో ₹3000 తగ్గిన బంగారం ధరలు!

image

అమెరికా విధించిన సుంకాలతో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ కూడా స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹280 తగ్గి ₹90,380కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹250 తగ్గి ₹82,850గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,02,900కి చేరింది. కాగా, గత మూడు రోజుల్లోనే కేజీ వెండిపై రూ.9,100, తులం బంగారంపై రూ.3000 తగ్గడం విశేషం.

News April 7, 2025

వాట్సాప్ యూజర్లకు అలర్ట్

image

ఆన్‌లైన్ మోసాల పట్ల వాట్సాప్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ నంబర్‌కి OTP పంపి, అనుకోకుండా పంపామని మోసగాళ్లు వాట్సాప్‌లో చాట్ చేస్తున్నారని తెలిపారు. వాట్సాప్‌ను హ్యాక్ చేసి సన్నిహితుల నంబర్లకు మీ పేరుతో డబ్బులు పంపించాలంటూ సందేశాలతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలన్నారు.

News April 7, 2025

ఈ క్లాక్ టవర్ కోసం రూ.40 లక్షలు ఖర్చు!

image

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా బిహార్ ప్రభుత్వం నిర్మించిన ‘క్లాక్ టవర్’పై విమర్శలొస్తున్నాయి. రూ.40 లక్షల వ్యయంతో షరీఫ్‌లో నిర్మించగా ఇది పక్షుల కోసం ఏర్పాటు చేసిన గూడులా కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ముందుగా నిర్దేశించిన మోడల్‌కు విరుద్ధంగా దీనిని నిర్మించగా, ప్రస్తుతం క్లాక్ కూడా పనిచేయట్లేదు. కాగా బ్రిటీషర్లు నిర్మించిన క్లాక్ టవర్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.

error: Content is protected !!