News October 7, 2024
ఆ కుర్చీలో కూర్చుంటే మరణశాసనం రాసుకున్నట్టేనా!
హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఆయన వారసత్వాన్ని స్వీకరించడానికి కీలక నేతలు జంకుతున్నారు. ఆ కుర్చీలో కూర్చోవడమంటే మరణశాసనాన్ని రాసుకున్నట్టే అనే భావనలో ఉన్నారు. ఈ కారణంతో ఇరాన్ మద్దతుగల ఈ సంస్థ పగ్గాలు చేపట్టడానికి కీలక నేత ఇబ్రహీం అమీన్ నిరాకరించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఈ బాధ్యతలు ప్రమాదకరమని హెజ్బొల్లా నేతలకు అవగతమైనట్టు తెలుస్తోంది.
Similar News
News October 7, 2024
రోహిత్ 2027 ప్రపంచకప్ ఆడతాడు: చిన్ననాటి కోచ్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కచ్చితంగా 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడని అతడి చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ అన్నారు. WTC ఫైనల్ తర్వాత టెస్టుల నుంచి తప్పుకుని వన్డేల్లో కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఫిట్నెస్ సమస్యలు కూడా లేవని తెలిపారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమికి రోహిత్ ఔటవడమే ప్రధాన కారణమని లాడ్ అభిప్రాయపడ్డారు.
News October 7, 2024
VIRAL: హైదరాబాద్ గొప్పతనం ఇదే!
పొట్టకూటి కోసం తరలివచ్చిన ఎంతో మందికి హైదరాబాద్ అండగా నిలిచిందని తెలిపే ఓ ఫొటో వైరలవుతోంది. ‘బతకడమే వేస్ట్ అనుకున్న నాకు.. హైదరాబాద్ ఎలా బతకాలో నేర్పింది’ అని ఓ వ్యక్తి తన ఆటో వెనుక రాసుకున్నారు. దీనిని ఓ వ్యక్తి ఫొటో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఉపాధి కోసం వస్తే అమ్మలా కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని నెటిజన్లు కితాబిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు HYDలో ఉపాధి పొందుతున్నారు.
News October 7, 2024
DMK vs పవన్ కళ్యాణ్
డీఎంకే, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇటీవల తిరుపతి పర్యటనలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం, ఉదయనిధి స్టాలిన్కు కౌంటర్ వేయడంపై డీఎంకే ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. బీజేపీ, అన్నాడీఎంకే కోసం పవన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు పవన్పై అడ్వకేటుతో ఫిర్యాదు చేయించడం, ప్రకాశ్ రాజ్తో ట్వీట్లు పెట్టించడం DMK పనేనని జనసైనికులు ఆరోపిస్తున్నారు.