News May 4, 2024

వడదెబ్బతో ఆరుగురి మృతి.. ఇవాళ, రేపు అధిక ఉష్ణోగ్రతలు

image

TG: రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. వరుసగా నాలుగో రోజు 46 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ తగిలి రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. ఇవాళ, రేపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు, పలు జిల్లాల్లో వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ నెల 6, 7 తేదీల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది.

Similar News

News November 16, 2025

BBCని వదలని ట్రంప్

image

మీడియా సంస్థ BBC, US అధ్యక్షుడు ట్రంప్ మధ్య వివాదం ముగిసేలా కనిపించడం లేదు. ఆయన మాట్లాడిన వీడియోను తప్పుగా ఎడిట్ చేసినందుకు BBC ఇప్పటికే <<18281054>>క్షమాపణ<<>> చెప్పింది. అయినా ఆయన వదలడం లేదు. 5 బిలియన్ డాలర్ల వరకు దావా వేస్తానని ట్రంప్ ప్రకటించారు. తాను అనని మాటలను అన్నట్లు తప్పుగా ప్రసారం చేశారని, నష్టపరిహారం చెల్లించడానికి నిరాకరించారని మండిపడ్డారు. త్వరలోనే బ్రిటన్ PM స్టార్మర్‌తో మాట్లాడతానని చెప్పారు.

News November 16, 2025

ఈరోజు వీటిని తినకూడదట.. ఎందుకంటే?

image

కార్తీక మాసంలో ఆదివారం రోజున ఉసిరి, కొబ్బరిని ఆహారంగా తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘ఉసిరి చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. విష్ణు కొలువై ఉండే వృక్షంగా దీన్ని భావిస్తారు. కొబ్బరి కూడా పవిత్రమైన పూజా ద్రవ్యం. సూర్యభగవానుడికి అంకితమైన ఈ ఆదివారం రోజున ఈ పవిత్ర వృక్షాలను గౌరవించాలి. వాటి ఫలాలను ఆహారంగా స్వీకరించడం ధర్మం కాదని గ్రహించాలి. ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి’ అని సూచిస్తున్నారు.

News November 16, 2025

ఆవుండగా గాడిద పాలు పితికినట్లు

image

ఒక పనిని సులభంగా, సరైన మార్గంలో చేసే అవకాశం లేదా వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిని విస్మరించి, కష్టమైన, పనికిరాని, అసాధ్యమైన మార్గాన్ని ఎంచుకున్న సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అందుబాటులో ఉన్న మంచి అవకాశాన్ని వదులుకుని అనవసరమైన శ్రమకు పోవడాన్ని ఈ సామెత సూచిస్తుంది.