News July 6, 2024
రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి

AP: అన్నమయ్య జిల్లా రామాపురం(మ) కొండవాండ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అటు చిత్తూరు జిల్లా పెద్దపంజాణి(మ) బసవరాజు వద్ద అనంతపురం నుంచి తమిళనాడు వెళ్తున్న టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు. 10 మందికి గాయాలయ్యాయి.
Similar News
News November 28, 2025
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ప్రిలిమినరీ నోటిఫికేషన్

AP: రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలుగా, మడకశిర, బనగానపల్లె, నక్కపల్లి, అద్దంకి, పీలేరును రెవెన్యూ డివిజన్లుగా పేర్కొంది. వీటిపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో కలెక్టర్కు రాతపూర్వకంగా తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు.. త్వరలో ఎగ్జామ్ షెడ్యూల్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
ఆన్లైన్ కంటెంట్ చూసేందుకు ఆధార్తో ఏజ్ వెరిఫికేషన్?

OTT/ఆన్లైన్ కంటెంట్పై సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. అశ్లీలంగా భావించే కంటెంట్ విషయంలో ఆధార్ ద్వారా ఏజ్ వెరిఫికేషన్ చేయవచ్చని చెప్పింది. ‘షో ప్రారంభంలో వేసే హెచ్చరిక కొన్నిక్షణాలే ఉంటుంది. తర్వాత కంటెంట్ ప్రసారం కొనసాగుతుంది. అందుకే ఆధార్ వంటి వాటితో వయసు ధ్రువీకరించాలి. ఇది సూచన మాత్రమే. పైలట్ ప్రాతిపదికన చేపట్టాలి. మనం బాధ్యతాయుత సొసైటీని నిర్మించాలి’ అని CJI జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.


